గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎన్టీఆర్ భవన్ లో.తాడేపల్లి నియోజకవర్గ నాయకులతో చంద్రబాబు సమావేశం అయ్యారు.
పరిషత్ అదే రీతిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించారని ప్రశంసించారు.ఇక భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకొని రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని నాయకులకు సూచించారు.
ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో చంద్రబాబు ఫైర్ అయ్యారు.
సంక్షేమం పేరుతో వైసిపి ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు.
ఈ క్రమంలో ప్రభుత్వం అని ప్రశ్నించిన వారిని అక్రమ కేసులతో బెదిరింపులకి పాల్పడుతూ ప్రశ్నించకుండా చేస్తున్నారని విమర్శించారు.అయినా కానీ తెలుగుదేశం పార్టీ బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.
కేవలం కక్షసాధింపు రాజకీయాలు చేస్తున్నారు తప్ప రాష్ట్రంలో అభివృద్ధి లేదని తెలిపారు.ఎలాగైనా వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు తాడేపల్లి నియోజకవర్గ నేతలతో సమావేశమైన సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు.