ఏపీలోని ఆలయాలపై దాడుల గురించి ప్రతి పక్షనేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశాడు.వైసీపీ హయాంలో చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో విగ్రహాల ద్వంసం కు, ఆలయాలపై దాడులు జరిగాయని చంద్రబాబు ఆరోపించాడు.
ఆలయాల దాడుల గురించి పోలీసు అధికారులకు పట్టిస్తే వారిని వదిలేసి పట్టించిన వారిపై కేసులు పెట్టడం సిగ్గు చేటు అన్నాడు.భోగి రోజున రాష్ట్ర డిజిపి మాట్లాడుతూ మతిస్థిమితం లేని వారు ఉన్మాదులు మాత్రమే ఆలయాల పై దాడులు చేస్తారని రాజకీయనాయకులు చెయ్యారని చెప్పి కనుమ రోజున మాట తప్పారు అని అన్నాడు.
ఆలయాలపై దాడులు చేసింది ప్రతిపక్షాలని వారికి అంటకడుతున్నాడని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశాడు.ప్రభుత్వ సలహా దారుడిగా ఉన్న సజ్జల రామకృష్ణ రెడ్డి స్క్రిప్ట్ రాసి ఇస్తే జగన్ డైరెక్షన్ చేస్తున్నాడు.
ఆ డైరెక్షన్ లో డిజిపి బాగా నటిస్తున్నడని ఎద్దేవా చేశాడు.తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని కోరాడు.వైసీపీ నీచులకు, దుర్మార్గులకు, తిరుపతి ఉప ఎన్నిక ద్వారా సరైన సమాదనం ఇవ్వాలని చంద్రబాబు ప్రజలకు పిలుపు నిచ్చాడు.