జగన్ నీ ఏప్రిల్ ఫూల్ చేయడానికి ప్రజలు రెడీగా ఉన్నారంటున్న చంద్రబాబు..!!

టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు పెట్టినా తాము సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.

 Chandrababu Says People Are Ready To Make Jagan Your April Fool , Ysrcp, Chandra-TeluguStop.com

ముందస్తుకు తాము సిద్ధంగా లేమని అనుకుంటే అది పగటి కలే అని పేర్కొన్నారు.ఇదే సమయంలో జగన్( Jagan ) ని ఇంటికి పంపేందుకు ప్రజలు కూడా రెడీగా ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.

మీడియాతో ఇష్టం గోష్టిగా మాట్లాడిన చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది.వైసీపీ పార్టీ నుండి చాలామంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని అన్నారు.

వైకాపా నాయకులు బానిసల్లా బతుకుతున్నారని పేర్కొన్నారు.

వైయస్ వివేకానంద రెడ్డి( YS Vivekananda Reddy ) కేసు దేశ చరిత్రలోనే సస్పెన్స్ థ్రిల్లర్.ఇటువంటి కేసులో న్యాయం జరగకపోతే వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం పోతుంది.జగన్ పెద్ద దోపిడీదారు.

ఆయన పేదల ప్రతినిధి కాదు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి ఊహించని షాక్ ఇచ్చారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో శాశ్వత చికిత్స చేస్తారని పేర్కొన్నారు.జగన్ కు ఏప్రిల్ ఫూల్ అనే పదం సరిగ్గా సరిపోతుంది.ప్రజలే జగన్ నీ పూల్స్ చేయటానికి రెడీగా ఉన్నారని అన్నారు.175 నియోజకవర్గాలలో వైసీపీని ఓడించడమే తమ లక్ష్యమని చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube