జులై 4వ తారీఖు ప్రధాని మోడీ ఏపీలో పర్యటించనున్న సంగతి తెలిసిందే.125వ అల్లూరి జయంతి వేడుకల నేపథ్యంలో లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..చంద్రబాబుకు రావాలని లెటర్ రాయడం జరిగింది.జులై 4వ తారీఖు ప్రధాని మోడీ ముఖ్యఅతిథిగా జరగనున్న ఈ వేడుకలకు తప్పకుండా హాజరుకావాలని… లెటర్ మాత్రమే కాక కిషన్ రెడ్డికి ఫోన్ కూడా చేయడం జరిగింది అంట.ఈ క్రమంలో ఈ వేడుకలలో భాగంగా ప్రధాని మోడీ చేతుల మీదగా 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఆవిష్కరించనున్నారు.
ఈ విగ్రహానికి దాదాపు మూడు కోట్ల రూపాయలతో అత్యంత భారీ హంగులతో 15 టన్నుల బరువుతో. తయారు చేయడం జరిగింది.ఒక చంద్రబాబుకి మాత్రమే కాదు టాలీవుడ్ అగ్రహీరో కేంద్ర మాజీ మంత్రి చిరంజీవికి కూడా కిషన్ రెడ్డి ఆహ్వానం పలికినట్లు సమాచారం.ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలో భారీ భద్రత ఏర్పాటు చేయడం జరిగింది.
భీమవరంలో విగ్రహావిష్కరణ., విశాఖపట్నం బహిరంగ సభలో.
మోడీ ప్రసంగించనున్నారు.