టీడీపీ అధినేత చంద్రబాబు గత కొద్దిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా పళ్ళు జిల్లాలలో ప్రాంతాలలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వ విధి విధానాలపై ప్రతిపక్ష నేతగా చంద్రబాబు తనదైన శైలిలో మండిపడుతున్నారు.
ప్రజల నుండి కూడా మంచి స్పందన వస్తూ ఉండటంతో చంద్రబాబు తాజాగా చేపడుతున్న యాత్రల పట్ల టీడీపీ క్యాడర్ లో ఫుల్ జోష్ నెలకొంది.యాత్రలో భాగంగా నేడు రాయలసీమ ప్రాంతాలలో చంద్రబాబు పర్యటించనున్నారు.
చిత్తూరు, అన్నమయ్య, జిల్లాలలో పర్యటించి మినీ మహానాడు, బాదుడే బాదుడు అనే నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి చంద్రబాబు రెడీ అవుతున్నారు.ఈ సందర్భంగా రెండు జిల్లాలలో ఉన్న తెలుగుదేశం పార్టీ క్యాడర్ చంద్రబాబు యాత్ర విజయవంతం చేయడానికి అన్ని రకాలుగా కృషి చేస్తున్నారు.
మరో పక్క పోలీసులు కూడా ఎక్కడికక్కడ భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టం చేస్తున్నారు.ప్రారంభంలో విజయనగరం జిల్లాలో యాత్రలు చేపట్టిన చంద్రబాబు నేటి నుండి రాయలసీమ ప్రాంతాలలో యాత్రకి రెడీ అవ్వుతున్నారు.