ఏపీలో టీడీపీ పరిస్థితి రోజురోజుకూ దారుణంగా తయారవుతోంది.నాయకత్వ లోపమా మరొకటా తెలియదు గానీ గతంలో ఎన్నడూ లేనంతగా ఆ పార్టీ కనీసం ఉనికిని కూడాచాటుకోలేకపోతోంది.
ఇప్పటికే చాలామంది పార్టీని వీడుతుండటంతో చంద్రబాబుకు పెద్ద టెన్షన్ మొదలైంది.ఇంకోవైపు పార్టీలోని కార్యకర్తలు కూడా నాయకత్వ మార్పు కోరుకోవడంతో నేతలు చంద్రబాబుపై నమ్మకం కోల్పోతున్నారు.
మొన్నటికి మొన్న మాజీ ఎమ్మెల్యే ఒకాయన పార్టీని వీడారు.ఇప్పుడు మరో షాక్ తగల నున్నట్టు తెలుస్తోంది.
మరో మహిళా నేత పార్టీని వీడేందుకు రెడీ అయినట్టు ప్రచారం జరుగుతోంది.
రీసెంట్గా తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన పనబాక లక్ష్మి పార్టీలో చురుగ్గా కనిపించట్లేదు.
కనీసం ఆమె ఓడిపోయినప్పటి నుంచి ఇప్పటి దాకా ఒక్కటంటే ఒక్క పార్టీ మీటింగ్కు హాజరుకాలేదు.కనీసం ఎక్కడా యాక్టివ్గా లేకపోవడంతో ఆమె అడ్రస్ మళ్లీ ఎవరికీ చిక్కడం లేదు.
ఈమె ఇంతకు ముందు 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీ కండువా కప్పుకుని పోటీ చేసినా కూడా వరుస పరాజయాలు ఆమెను వెంటాడుతున్నాయి.గతంలో కాంగ్రెస్ లో ఉన్నప్పుడు వరుస విజయాలు దక్కించుకున్న ఆమె ఇప్పుడు కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోతున్నారు.
ఇక ఇప్పుడు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో పోటీ చేసిన ఆమె ఓడిపోయినప్పటి నుంచి ఎక్కడా కనిపించట్లేదు.ఇంటికే పరిమితం అయిపోయారు.దీంతో ఆమెకు కొందరు కాంగ్రెస్ లోని సీనియర్లు అలాగే టీడీపీ సీనియర్లు కూడా టీడీపీ ఆమెకు కలిసి రావట్లేదనే సలహాలు ఇస్తున్నారంట.ఆమె పార్టీ మారితే గానీ రాజకీయ భవిష్యత్ ఉండదనే ప్రచారం చేస్తున్నారంట.
దీంతో ఆమె పార్టీ మారే ఉద్ధేశ్యంలో ఉన్నట్టు తెలుస్తోంది.ఇందులో భాగంగానే టీడీపీలో ఉన్న తన వర్గాన్ని కలిసి చర్చలు జరుపుతున్నారంట.
అయితే ఆమె అధికార పార్టీలోకి వెళ్తారా లేక ఇతర ప్రతిపక్ష బీజేపీ లేదా జనసేనలోకి వెళ్తారా అనేది మాత్రం ఇంకా తెలియట్లేదు.