సింగపూర్ జాతి పిత ఇటివల మృతి చెందడం తో అక్కడికి వెళ్దామని ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం రాత్రి 11గంటలకు బయలు దేరి ఆదేశం లో పరామర్సలు ముగించుకుని వచ్చేద్దామని సిద్ధమయ్యారు .అయితే అనుమతి కోసం విదేశాంగ మంత్రి శాఖ కార్యాలయం కి సిఎమ్ కార్యాలయం నుంచి పేపర్సు వెళ్ళాయి తీరా అక్కడ కొర్రి వేసి ప్రధాన మంత్రి కార్యాలయానికి పంపారు ఏమిటా కొర్రి అంటే ప్రధాని సింగపూర్ జాతిపిత అంత్యక్రియలకు వెడుతున్నారు .
ఆయన ఒక్కరే వెడుతున్నారు .ఈలోగా భారత్ నుంచి ముందుగా వేరెవ్వరు వెళ్ళడానికి లేదు అని బాబు పర్యటనకు గండి పెట్టారు .దీనిపై బాబు పర్యటన అర్ధాంతరంగా వాయిదా పడింది .ఒకవేళ ప్రధాని రారమ్మంటే ఆయనతో కలిసి వెళ్ళవచ్చని ప్రధాని కార్యాలయం బాబుకు తెలియపరిచారు .ఒకవేళ ప్రధాని కాదంటే బాబు ఈ తరహ పర్యటన చేయరాదు అని చెప్పుకుంటున్నారు
.