ఏపీ అభివృద్ధి చెందుతుంటే చంద్ర బాబు అడుగడుగునా అడ్డుపడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించడమే కాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొడుతున్నారంటూ వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాసరావు విమర్శించారు.అమరావతిలో చంద్రబాబు చేసిన తప్పిదాలు బయటపడుతాయనే ఉద్దేశంతోనే ఇలా ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నారని అవంతి విమర్శించారు.
రాజధానుల విషయంలో అసలు మీ నిర్ణయం ఏంటి అనేది మీ పార్టీ నాయకులతో 13 జిల్లాల్లో సమావేశం నిర్వహించి తగిన నిర్ణయానికి రావాలని ఆయన సూచించారు.మిమ్మల్ని గెలిపించిన విశాఖ ప్రజలకు అభివృద్ధి అవసరం లేదా అని చంద్రబాబును ప్రశ్నించారు.
జాతీయ పార్టీగా చెప్పుకునే టీడీపీ తెలంగాణాలో కనుమరుగయ్యిందని ఇప్పుడు ఏపీలోనూ అదే పరిస్థితి తలెత్తబోతున్నట్టు మంత్రి జోస్యం చెప్పారు.