మీకు అభివృద్ధి అవసరం లేదా ? బాబు కి వైసీపీ మంత్రి ప్రశ్న

ఏపీ అభివృద్ధి చెందుతుంటే చంద్ర బాబు అడుగడుగునా అడ్డుపడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించడమే కాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొడుతున్నారంటూ వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాసరావు విమర్శించారు.అమరావతిలో చంద్రబాబు చేసిన తప్పిదాలు బయటపడుతాయనే ఉద్దేశంతోనే ఇలా ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నారని అవంతి విమర్శించారు.

 Chandrababu Naidu Ysrcp Tdp Avanthi Srinivasa Rao-TeluguStop.com

రాజధానుల విషయంలో అసలు మీ నిర్ణయం ఏంటి అనేది మీ పార్టీ నాయకులతో 13 జిల్లాల్లో సమావేశం నిర్వహించి తగిన నిర్ణయానికి రావాలని ఆయన సూచించారు.మిమ్మల్ని గెలిపించిన విశాఖ ప్రజలకు అభివృద్ధి అవసరం లేదా అని చంద్రబాబును ప్రశ్నించారు.

జాతీయ పార్టీగా చెప్పుకునే టీడీపీ తెలంగాణాలో కనుమరుగయ్యిందని ఇప్పుడు ఏపీలోనూ అదే పరిస్థితి తలెత్తబోతున్నట్టు మంత్రి జోస్యం చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube