కృష్ణా జిల్లా జగ్గయ్యపేట టీడీపీ కార్యకర్త వేణు కోరికను తీర్చారు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.తాను కొనుగోలు చేసిన కొత్త కారును తమ ప్రియతమ నేత చంద్రబాబు తో ప్రారంభించాలని వేణు కోరుకున్నారు.
తన కార్ తీసుకుని పార్టీ కార్యాలయానికి వచ్చారు.పార్టీ కార్యాలయం వద్ద అధినేత చంద్రబాబు రాగానే తన కొత్త కార్ లో కూర్చోవాలని కోరాడు.
వెంటనే డ్రైవింగ్ సీట్లో కూర్చున్న చంద్రబాబు పార్టీ కార్యకర్త చిన్నపాటి కోరికను తీర్చారు.దీంతో వేణు తో పాటు కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు.