దెందులూరు మాజీ శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ ను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించి ధైర్యం చెప్పారు.చంద్రబాబు పరామర్శతో చింతమనేని ముఖంలో చిరునవ్వు వెల్లువిరిసింది.
ఎస్సి ఎస్టీ ఎట్రాసిటీ కేసులో అరెస్ట్ అయ్యి జైలుపాలయిన చింతమనేనికి తాజాగా బెయిల్ వచ్చింది.ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకులో టీడీపీ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో బాబు ఆ కార్యక్రమానికి హాజరవుతూ దారిలో చింతమనేని పెదవేగి మండలం దుగ్గిరాలకు వెళ్లిన చంద్రబాబు చింతమనేని కుటుంబంతో మాట్లాడారు.
పార్టీ తరపున చింతమనేని కుటుంబానికి అన్నిరకాలుగా అండగా నిలబడతామని, అక్రమ కేసులు ఎన్ని పెట్టినా టీడీపీ నాయకులు ఎవరూ భయపడరని చింతమనేనికి ధైర్యం చెప్పారు.చింతమనేని వివిధ కేసులకు సంబంధించి ఏలూరు జిల్లా జైల్లో 67 రోజులు పాటు శిక్ష అనుభవించి బెయిల్పై విడుదలయ్యారు.
ప్రస్తుతం టీడీపీ నుంచి నాయకులంతా వలస బాట పడుతున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పేందుకు బాబు వివిధ రకాలుగా ప్రయత్నిస్తున్నారు.