తెలుగుదేశం పార్టీలో సినీ నటుడు హిందూపురం ఎమ్యెల్యే నందమూరి బాలకృష్ణ కు అన్యాయం జరుగుతోంది అంటూ సానుభూతి వ్యక్తం అవుతోంది.అయితే ఆ సానుభూతి తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి కాదు.
ఎప్పుడూ టీడీపీ నాయకులపై విరుచుకుపడే వైసీపీ నేతల నుంచి అందులోనూ నారా, నందమూరి ఫ్యామిలిలను విమర్శించేందుకు ఉత్సాహం చూపించే నగరి ఎమ్యెల్యే ఆర్కే రోజా నోటి నుంచి ఈ వ్యాఖ్యలు వినిపించాయి.
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్వయానా తన బావమరిది, వియ్యంకుడు అయిన నందమూరి బాలకృష్ణకు తీరని అన్యాయం చేస్తున్నారని రోజా ఆవేదన వ్యక్తం చేశారు.
బుధవారం రోజా అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడారు.బాలయ్య బాబుకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారంటూ ఆమె కామెంట్ చేయడంతో టిడిపి ఎమ్మెల్యేలు షాక్ అయ్యారు.
బాబు కళాకారులకు అన్యాయం చేస్తున్నారనడానికి నందమూరి బాలకృష్ణకు అసెంబ్లీ లో మాట్లాడే అవకాశం కల్పించకపోవడమే కారణమని ఆమె విమర్శించారు.
తమ పార్టీ నాయకులను ప్రభుత్వంపై విమర్శలు చేయించడానికి ఉపయోగించుకుంటున్న చంద్రబాబు బాలకృష్ణ లాంటి కళాకారులకు మాట్లాడే అవకాశం కల్పించకపోవడం ఏంటి అంటూ ప్రశ్నించారు.
పనిలో పనిగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ను ఉద్దేశించి కూడా రోజా విమర్శలు చేశారు.లోకేశ్ను చూస్తే ఏపీ మంత్రుల కాళ్ళు వణుకుతున్నాయన్న టిడిపి నేతల మాటలకు ఆమె కౌంటర్ ఇచ్చారు.
మగలిగిరి అని పలకడం రాక మందలగిరి అని పలుకుతూ దాన్ని సరిచేసుకుఎందుకు ట్యూషన్ పెట్టించుకున్న లోకేష్ ను చూస్తే ఎవరి కాళ్లయినా వణకాల్సిందేనని ఆమె వెటకారం చేసారు.