కొద్దిరోజుల క్రితం గన్నవరంలో టిడిపి ఆఫీసు ధ్వంసం వ్యవహారం తరువాత వైసిపి వర్సెస్ టిడిపి అన్నట్లుగా విమర్శలు, ప్రతి విమర్శలు చోటుచేసుకోవడంతో పాటు, టిడిపి జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిని పోలీసులు అరెస్టు చేయడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.ఈ వ్యవహారంలో గన్నవరం ఎమ్మెల్యే వంశీ అదే పనిగా టిడిపిని టార్గెట్ చేసుకుని పెద్ద ఎత్తున విమర్శలు చేసినా.
ఇంకా చేస్తూనే ఉన్నా… ఆ స్థాయిలో వంశీ విమర్శలకు ప్రతి విమర్శలు చేయడంలో టిడిపి విఫలమైందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
కేవలం విజయవాడకు చెందిన టిడిపి కీలక నేత బుద్ధ వెంకన్న తదితరులు తప్ప, మిగిలిన కీలక నాయకులు ఎవరూ ఈ వ్యవహారంపై స్పందించకపోవడం , పార్టీలో కీలకంగా ఉన్న విజయవాడ నేతలు అంతంత మాత్రమే అన్నట్టుగా వ్యవహరించడం వంటివి చంద్రబాబుకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి.దీనిపైనే ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.పార్టీపై దాడి ఈ స్థాయిలో జరుగుతున్నా, కీలక నేతలు మౌనంగా ఎందుకు ఉన్నారు? మీడియా ముందుకు వచ్చి వైసిపి ప్రభుత్వం ఎందుకు విమర్శించడం లేదు ? రాష్ట్రవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చిన నేతలు సైలెంట్ గా ఎందుకు ఉన్నారనే విషయాలపై చంద్రబాబు ఆరా తీస్తున్నారట.
ఎన్నికలకు ఇంకా సమయం దగ్గరకు వచ్చేస్తున్నా, నాయకులు ఇంకా యాక్టివ్ కాకపోవడంపై బాబు సీరియస్ గా ఉన్నారట.పార్టీ అధినేతను తిట్టిపోస్తున్న సరే టిడిపి కీలక నాయకులు గా పార్టీలో గుర్తింపు పొందిన వారు ఎందుకు మౌనంగా ఉన్నారని, విజయవాడలో ఉన్న నాయకులు కూడా సంఘటన స్థలానికి రాకపోగా, కనీసం సంఘీభావం తెలపకపోవడం , పట్టాభి కుటుంబ సభ్యులను పరామర్శించే ప్రయత్నం చేయకపోవడం వంటివి బాబు ఆగ్రహానికి కారణమట. ముఖ్యంగా విజయవాడ తూర్పు నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎంపీ కేసినేని నాని వంటి వారు ఈ వ్యవహారంపై సైలెంట్ గా ఉన్నారు .పార్టీ సీనియర్లు కూడా ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించడం వంటివి బాబుకు ఆవేదన కలిగిస్తున్నాయట.
తాజా వార్తలు