గ్రేటర్ ఎన్నికలలో గెలుపు కోసం ఏ ఒక్క అంశాన్నీ వదలడం లేదు రాజకీయ పార్టీలు.తమకి చేతిలో ఉన్న ఏ ఆయుధాన్నీ ఏ అవకాశాన్నీ ఒదులుకోవడానికి వారు ఇష్టపడట్లేదు .
కానీ చంద్రబాబు స్వయానా వియ్యంకుడు , సీమాంధ్ర జనాలలో మంచి పేరున్న నందమూరి బాలకృష్ణ ని ఎందుకు దూరంగా పెట్టారు అనేది ఇప్పుడు బాలయ్య ఫాన్స్ తో పాటు రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద చర్చగా మారింది.
కేవలం మొన్నటి వరకూ నటుడు అయిన బాలయ్య ఇప్పుడు ఏపీ నుంచి ఎమ్మెల్యే గా సారధ్యం వహిస్తున్నారు.
అంతేనా, నందమూరి బసవతారకం క్యాన్సన్ ఇన్స్టిట్యూట్కి ఛైర్మన్గానూ ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.ఇది హైద్రాబాద్లోనే వుంది.
నైజాం సినీ రంగానికి అతి పెద్ద మార్కెట్.నైజాంలో బాలయ్య హవా తక్కువే కాదు.
నైజాంలోనూ గ్రేటర్ హైద్రాబాద్ పరిధి సినీ రంగానికి అత్యంత కీలకం.
హైద్రాబాద్లోని సీమాంధ్రుల ఓట్లకోసం టీడీపీ, వ్యూహాత్మకంగా ఏపీ టీడీపీ నేతల్ని ప్రచారంలోకి దించిన విషయం విదితమే.
అలాంటప్పుడు ‘డిక్టేటర్’ బాలయ్యని, చంద్రబాబు ఎందుకు ప్రచారంలోకి దించలేదట.? బాలయ్య ని అండర్ ప్లే చేయిస్తూ రాజకీయంగా అణగదొక్కి ఉంచాలి అనేది చంద్రబాబు వ్యూహం అనీ అనవసర హైప్ బాలయ్య కి ఇచ్చి మరీ జనాలలో ఓవర్ క్రేజ్ ఇవ్వడం బాబు కి ఇష్టం లేదు అనీ చెబుతున్నారు.పార్టీ ప్రయోజనాల సంగతెలా వున్నాసరే, పార్టీలో తనయుడి ప్రయోజనమే చంద్రబాబుకి ముఖ్యం.బాలయ్య ప్రచారం కాస్తో కూస్తో టీడీపీకి ఉపయోగపడ్తుందని తెలిసీ చంద్రబాబు, బాలయ్యను గ్రేటర్ ప్రచారానికి దూరం పెట్టడం, తెలంగాణ టీడీపీ నేతలకు ఒకింత ఇబ్బందికరంగానే మారింది.
.