తెలంగాణాలో ముందస్తు ఎన్నికల పోరు ఎంతో దూరం లేదు.వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకి ప్రధాన అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ ఇప్పటికే తన దూకుడుని పెంచేసింది.
కూటమి పార్టీలు సైతం ఎప్పుడెప్పుడు ప్రచారం లోకి దూకేసి కేసీఆర్ ని టార్గెట్ చేద్దామా అంటూ ఉవ్విళ్ళు ఊరుతున్నాయి….ఇదిలాఉంటే హరీష్ రావుతో కలిసి కేసీఆర్ ఇప్పటికే ప్రచార వ్యూహాలు సిద్దం చేశారట.
అంతేకాదు కూటమి సైతం ప్రచారం చేయడానికి సంసిద్ధం అన్నట్టుగా సంకేతాలు పంపుతోంది.అయితే తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి బాబు వెళ్తాడా.?
ఇదే ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారిపోయింది.ఎందుకంటే కూటమి నేతలు అందరూ ప్రచారంలో ఒకే వేదికపై ఉండి ప్రచారం చేయాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నారు.అయితే ఇక్కడే చంద్రబాబు కి ఊహించని షాక్ ఎదురవుతోంది.ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ తప్పకుండా వైఎస్ భజన చేయాల్సిందే.వైఎస్ లేనిదే తెలంగాణలో కాంగ్రెస్ లేదు అనేది అమ్దరికీ తెలుసు అంతేకాదు తెలంగాణలో ఉన్న అత్యధిక శాతం ఓట్లు రెడ్డి ,గౌడ కులస్తులవే అయితే ఈ రెండు కులాలకి వైఎస్ అంటే దైవంతో సమానం.దాంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉన్నంత వరకూ కూడా ఇది తప్పని పరిస్థితి.ఇదిలాఉంటే
ఒకపక్క వైఎస్ ని కాంగ్రెస్ పొగుడుతూ ఉంటే అదే వేదికపై ఉన్న తెలుగుదేశం సైతం ఈ వ్యాఖ్యలకి చప్పట్లు కొట్టాలా వద్దా.?? కొడితే ఒకరకం తలనొప్పి కొట్టకపోతే మరొక రకం తలనెప్పి దాంతో ఇప్పుడు చంద్రబాబు కి ముందు నుయ్యి వెనుక గొయ్యి లా అయ్యింది పరిస్థితి.తెలంగాణలో వైఎస్ పై పొగడ్తలకి టీడీపీ అడ్డంగా తలూపితే ఏపీలో ఆ పరిస్థితి జగన్ రెడ్డి కి కలిసొచ్చినట్టే.ఒక వేళ అక్కడ కాంగ్రెస్ వైఎస్ పేరు ఎత్తుకోక పొతే అటు తెలంగాణలో ఇటు ఏపీలో సైతం ఓట్లు ఒక్కటి కూడా రాని పరిస్థితి.
దాంతో ఈ సంకట స్థితిలో బాబు చిక్కుకుని అడ్డంగా బుక్కాయరని అంటున్నారు విశ్లేషకులు.