తెలుగుదేశం పార్టీ పగ్గాలు చినబాబు లోకేష్ ఎప్పుడు అందుకుంటాడో తాను ఎప్పుడు విశ్రాంతి తీసుకుందామా అనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నాడు.అయితే లోకేష్ ఇప్పుడు అప్పుడే పార్టీ పగ్గాలు తీసుకుని సమర్థవంతంగా పార్టీని ముందుకు నడిపించే అంతా సత్తా లేదు అనే అభిప్రాయం అధినేత చంద్రబాబుతో పాటు పార్టీ శ్రేణుల్లోనూ బలంగా ఉంది.
లోకేష్ ను సమర్ధుడైన నాయకుడు గా తీర్చిదిద్దుతామని బాబు చూస్తున్నా ఆయన మాత్రం ట్విట్టర్ పిట్టగానే మిగిలిపోతున్నాడు.ఆయన ఎక్కడ ఏం మాట్లాడినా సోషల్ మీడియాలో కామెడీగా మారిపోతుంది.
లోకేష్ ను అసమర్థ నాయకుడిగా తీర్చిదిద్దడంలో వైసిపి అనుకూల సోషల్ మీడియా అకౌంట్ లు బాగా సక్సెస్ అయ్యాయి.దీని నుంచి లోకేషన్ బయటపడేసేందుకు చంద్రబాబు తీవ్ర కసరత్తు మొదలుపెట్టాడు.
ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారిన అమరావతి పోరాటంలో లోకేష్ ను బాగా యాక్ట్ చేసి లోకేష్ ఇమేజ్ అమాంతం పెరిగేలా చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు.దీనికి టీడీపీ అనుకూల మీడియా ద్వారా ఆయనకు బాగా ఫోకస్ పెరిగేలా ప్రయత్నాలు మొదలయ్యాయి.రైతులతో కలిసి ధర్నాలు, రాస్తారోకోలు చేయడం, మీడియాతో చిట్ చాట్, సోషల్ మీడియాలో వైసీపీ పై విమర్శలు చేయడం వీటన్నిటికీ టీడీపీ అనుకూల మీడియాలో బాగా ఫోకస్ అయ్యేలా కొద్దిరోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.అదీ కాకుండా అమరావతి ప్రాంతంలో టిడిపి హయాంలో బాగా అభివృద్ధి పనులు చేసినా మంగళగిరిలో లోకేష్ ఓడిపోవడం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇప్పుడు ఈ ప్రజా ఉద్యమాల ద్వారా లోకేష్ బలమైన నాయకుడిగా అందరిలోనూ గుర్తింపు తెచ్చుకుంటే రాబోయే ఎన్నికల్లో కూడా లోకేష్ అమరావతి నుంచి పోటీ చేసి ప్రజల మద్దతుతో విజయం సాధించాలని ప్రయత్నాలు చేస్తున్నారు.అందుకే సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో కూడా లోకేష్ పరపతి పెరిగేలా చేస్తున్నారు.కొద్ది నెలల తర్వాత లోకేష్ నాయకత్వ పనితీరుపై సర్వే చేయించి అప్పుడు పార్టీ పగ్గాలు అప్పగించి తాను తెర వెనుక రాజకీయాలు చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.అయితే లోకేష్ ఎంతవరకు తన సమర్ధతహను నిరూపించుకుంటాడో చూడాలి.