ఎన్నికల సమయం దగ్గరకు వచ్చిన నేపథ్యంలో… ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లో అసహనం … ఆందోళన పెరిగిపోతోంది.ముఖ్యంగా తనను ఒక్కడినే టార్గెట్ చేసుకుని… బీజేపీ, వైసీపీ , టీఆర్ఎస్ పార్టీలు వ్యూహాలు పన్నుతున్నాయని బాబు బాధపడిపోతున్నాడు.
తాను ఎంత ప్రయత్నించినా… ప్రజల్లో పరపతి పెరగకుండా టీడీపీ వ్యతిరేక పార్టీలన్నీ కలిసి కుట్రపన్నుతున్నారని బాబు ప్రజలకు చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.ఇక ఏపీ లో ఎన్నికల నోటిఫికేషన్ కూడా దగ్గర్లో ఉండడంతో… పార్టీ ఫిరాయింపులు కూడా ఎక్కువయ్యాయి.
అయితే పరిస్థితులు ఎలా ఉన్నా సరే టీడీపీ అధినేత మాత్రం సంక్షేమ పథకాలనే నమ్ముకున్నాడు.
ఎన్నికల ముందు అభివృద్ధి కార్యక్రమాలకు పెద్ద పీట వేస్తే … ప్రజలు బాగా గుర్తుంచుకుంటారని నమ్ముతున్నాడు.తాజాగా ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటిస్తున్న బాబు తాను పెద్ద ఎత్తున చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గురించి వివరిస్తూ… ప్రత్యర్థి పార్టీలను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు.తాను ఏపీని అభివృద్ధి చేయాలని చూస్తుంటే…మోదీ అడ్డంపడుతున్నారని ముందు నుంచి చెప్పుకొస్తున్న బాబు.
ఈ సారి మోడీ పై మరిన్ని విమర్శలు గుప్పించాడు.
చదువుకోని వాళ్లకు రాజ్యాధికారం అప్పగిస్తే అభివృద్దికి బదులు దాడులు జరుగుతాయని సెటైర్లు వేసాడు.జగన్ కేసీఆర్ ఇద్దరూ… ఒక్కటయ్యి ఏపీ మీద కుట్రలు చేస్తున్నారని అన్నారు.60 ఏళ్ల కష్టాన్ని హైదరాబాద్లో వదిలేసి వస్తే.మోడీ, జగన్, కేసీఆర్ కుట్రలతో ఏపీని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు.ఎవరెన్ని కుట్రలు చేసినా తాను ఏపీని అభివృద్ధి చేసి తీరుతాయని బాబు శపథం చేస్తున్నారు.
ప్రస్తుతం టీడీపీ ఎమ్యెల్యేలు, ఎంపీలు ఒక్కొక్కరిగా ఫ్యాను పార్టీలోకి జంప్ చేస్తుండడం బాబు లో మరింత అసహనాన్ని పెంచుతోంది.