23 పులుల్లో ఒక్క పులి పోయిందన్న బాబు

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్న పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు.పలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన కార్యకర్తలతో మాట్లాడాడు.

 Chandrababu Naidu Comments On Vallabhaneni Vamshi-TeluguStop.com

ఈ సందర్బంగా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ నుండి తప్పుకోవడం పట్ల స్పందించాడు.తెలుగు దేశం పార్టీలో 23 మంది పులులు(ఎమ్మెల్యేలు) ఉంటే పోయింది కేవలం ఒకే ఒక్క పులి.

ఇంకా 22 పులులు ఉన్నాయంటూ చంద్రబాబు నాయుడు విభిన్నంగా స్పందించాడు.

ఒక్క పులి పోయినంత మాత్రాన ఏమీ జరగదని, తమకు ఎలాంటి నష్టం లేదు అంటూ వంశీని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్నాయి.

వంశీని పల్లెత్తు మాట అనకుండా పులి అంటూ సంభోదించడంతో ఆయనతో పెట్టుకోవడం ఎందుకులే అన్నట్లుగా బాబు మాట్లాడాడు అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ మద్య కాలంలో వల్లభనేని వంశీ ఏ స్థాయిలో తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నాడో తెల్సిందే.

అందుకే ఆయనతో పెట్టుకోవడం ఎందుకు అనే ఉద్దేశ్యంతో చంద్రబాబు నాయుడు సింపుల్‌గా ఒక్క పులి పోతే పోయేది ఏమీ లేదు అంటూ వ్యాఖ్యలు చేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube