తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా అసెంబ్లీలో మాట్లాడుతూ ఏపీలో నిర్మాణం జరుగుతున్న పోలవరం ఎత్తును తగ్గించేందుకు చర్చలు జరుపుతామంటూ హామీ ఇచ్చిన విషయం తెల్సిందే.ఈ విషయమై ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో తప్పుబడుతున్నాడు.
ఏపీ ప్రాజెక్ట్ విషయంలో మీ జోక్యం ఏంటీ అంటూ ప్రశ్నించాడు.సీఎం జగన్ ఆలోచించకుండా పోలవరం విషయంలో నిర్ణయాలు తీసుకోవడం ఏమాత్రం కరెక్ట్ కాదు అంటూ చంద్రబాబు నాయుడు సూచించారు.
పోలవరం విషయంలో ఎవరితోనూ చర్చలు జరపాల్సిన అవసరం లేదని, ఏవో ప్రయోజనాల కోసం ఏపీ ప్రజలను మోసం చేయవద్దని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు పోలవరం నిర్మాణం ఆగిపోవడంపై కూడా మండి పడ్డాడు.
స్వార్ధం మరియు దురుద్దేశంతో మాపై కక్షతో పోలవరంను నిలుపుదల చేయడం జరిగిందని, ఆ ప్రాజెక్ట్ను వెంటనే పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశాడు.