టీడీపీ నాయకులపై దాడి, వారి పనే అంటున్న బాబు

తెలుగు దేశం పార్టీ నాయకులు బొండ ఉమ మరియు బుద్దా వెంకన్నలు మాచర్ల వద్ద కారులో ప్రయాణిస్తున్న సందర్బంగా కొందరు వ్యక్తులు పెద్ద పెద్ద కర్రలతో దాడికి దిగారు.అయితే కారు డ్రైవర్‌ కాస్త తెలివిగా ఆలోచించడంతో వారిద్దరు కూడా ప్రాణాలతో బయట పడ్డారు.

 Chandrababu Naidu Comments On Ap Ycp Party Telugustop-TeluguStop.com

డ్రైవర్‌ సమయస్ఫూర్తి వల్ల ఆ రౌడీల నుండి వారు బయట పడ్డట్లుగా తెలుగు దేశం పార్టీ నాయకులు చెబుతున్నారు.ఈ విషయమై తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు.

దాడికి పాల్పడ్డ వ్యక్తి పొటోలు మరియు వీడియోలు బయటకు విడుదల చేయడంతో పాటు ఆయన గతంలో వైకాపా అధినేత జగన్‌ మరియు వైకాపా పార్టీ ముఖ్య నేతలతో ఉన్న ఫొటోలను విడుదల చేశారు.వైకాపాకు చెందిన గుండూనే మా నాయకులపై దాడికి ప్రయత్నించాడు అంటూ బాబు ఆరోపించాడు.

ఈ దాడి విషయమై డీజీపీ మరియు గవర్నర్‌లను కలిసి ఫిర్యాదు చేయబోతున్నట్లుగా బాబు ప్రకటించాడు.ఇలాంటి దాడి ప్రజాస్వామ్యంకు దెబ్బ అంటూ బాబు ఆవేదన వ్యక్తం చేశాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube