40 మంది కిరాయి గూండాలను నాపైకి పంపించారు

ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డిపై చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో మండి పడ్డాడు.నేడు అమరావతిలో పర్యటించేందుకు వెళ్లిన చంద్రబాబు నాయుడపై రాళ్లు మరియు చెప్పుల దాడి జరిగిన విషయం తెల్సిందే.

 Chandrababu Naidu Comments On Ap Cm Jagan Mohan Reddy-TeluguStop.com

మా జీవితాలను నాశనం చేసిన నువ్వు మళ్లీ ఎందుకు వచ్చావంటూ వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు.రాజధాని ప్రాంత రైతుల్లో కొందరు చంద్రబాబు నాయుడు పర్యటను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిని వైకాపా గూండాలంటూ చంద్రబాబు పేర్కొన్నాడు.

చంద్రబాబు నాయుడు తనపై దాడి జరిగిన తర్వాత మాట్లాడుతూ.

వైకాపా గూంఢాలు నాపై దాడి చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.హైదరాబాద్‌ను ఒక ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాను.

అలాంటి నేను అమరావతిని కూడా అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలని ఆశ పడ్డాను.కాని ఇలా దారుణంగా నాపై ఇలాంటి దాడులు జరగడం బాధగా ఉందని ఆయన అన్నాడు.40 మంది కిరాయి గుండాలను పంపించి నాపై దాడి చేయించినంత మాత్రాన భయపడి పోనంటూ ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు అన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube