ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాత పథకాలకు కొత్త పేర్లు పెడుతూ తమ పథకాలంటూ ప్రచారం చేసుకుంటున్నాడు అంటూ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు.నేడు వైజాగ్లో ఏర్పాటు చేసిన పార్టీ సమావేశంలో ఆయన పాల్గొన్నాడు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జగన్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు.ప్రభుత్వం ఏర్పాటు అయిన ఈ కొద్ది సమయానికే ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా వచ్చిందని చంద్రబాబు అన్నాడు.
త్వరలోనే మీ ప్రభుత్వంకు రంగు వేసి మరీ పంపించడం ఖాయం అంటూ బాబు ఎద్దేవ చేశాడు.
గతంలో నేను ఎన్నో పథకాలను తీసుకు వస్తే వాటిని యదాతధంగా రాజశేఖర్ రెడ్డి ఉంచాడు.
అందుకే హైదరాబాద్తో పాటు రాష్ట్రం అంతగా అభివృద్ది చెందింది.కాని మీరు మాత్రం నేను తీసుకు వచ్చిన పథకాలను మూసేయడంతో పాటు అమరావతికే అన్యాయం చేస్తున్నారు.
రాజధానిని నాశనం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ప్రతి తెలుగు వాడు కూడా రాజధాని కోసం పోరాడే రోజులు వస్తాయని జగన్ ఆ విషయాన్ని గుర్తించకుంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ హెచ్చరించాడు.
గ్రామాల్లో ఏర్పాటు చేసిన సచ్చివాలయాలు వైకాపా కార్యలయాలను తలపిస్తున్నట్లుగా విమర్శించాడు.