తెలుగుదేశం పార్టీలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యవహారం మరోసారి తెరమీదకు వచ్చింది.ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
వాటి నుంచి గట్టెక్కేందుకు ఏదో ఒక అంశంతో నిత్యం ప్రజా పోరాటాలు చేస్తూ అధికార పార్టీ దూకుడు అడ్డుకునే విధంగా ప్రయత్నాలు చేస్తోంది.దీనిపై వైసిపి కూడా అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తోంది.
అయినా చంద్రబాబు నాయుడు లెక్కచేయకుండా అమరావతిలో రాజధానిని తరలించడాన్ని గట్టిగానే వ్యతిరేకిస్తున్నట్టుగా జనాల్లో ఒక అభిప్రాయాన్ని కలిగించి బాగానే సక్సెస్ అయ్యారు.రాజధాని రైతులకు మద్దతుగా నిలబడటమే కాకుండా జోలె పట్టుకుని విరాళాలు కూడా సేకరించారు
.
టిడిపి సీనియర్లు కూడా తమ వంతుగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వైసిపిని చాలా వరకు కట్టడి చేయగలిగారు.కానీ ఇంత జరుగుతున్నా చంద్రబాబు వియ్యంకుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాత్రం వైసీపీ ని ఉద్దేశించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండడం ఇప్పుడు పార్టీలోనే తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.
అందరికంటే ఎక్కువగా టిడిపి విషయంలో స్పందించాల్సిన బాధ్యత బాలయ్య మీద ఉన్నా మనకెందుకు వచ్చిందిలే అన్నట్టుగా బాలయ్య పట్టించుకోకుండా సినిమా షూటింగ్ లలో బిజీ అవుతున్నారు.ఇవన్నీ టిడిపిలో ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి.
తాము పార్టీ కోసం నిరంతరం కష్టపడుతూ ప్రెస్ మీట్ లు పెడుతూ వైసీపీకి టార్గెట్ గా మారుతూ ఉంటే, ఈ విషయాలేవీ తనకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ సదరు నాయకులు చంద్రబాబు ని ప్రశ్నిస్తున్నారట.ఈ విషయంలో బాలయ్య స్పందించకపోయినా తాము స్పందిస్తూ వైసీపీకి టార్గెట్ గా మారుతున్నామని చెబుతూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంటే బాబు వారికి నచ్చ చెపుతున్నారట.బాలయ్య స్పందించడం వల్లే ఎక్కువ అనర్దాలు వస్తాయని.ఆయన సైలెంట్ గా ఉంటేనే బెటర్ అంటూ బాబు వారికి చెబుతున్నాడట.
ఇక లోకేష్ విషయంలోనూ బాబు ఆలోచన ఇలాగే ఉందట.కానీ బాలయ్య రాజధాని విషయం ఏదో ఒకటి మీడియా సమావేశం పెట్టి స్పందిస్తే పార్టీలో కొత్త ఉత్సాహం వస్తుందని, కానీ అలా చేయకుండా ఎవరికి వారు సైలెంట్ అయిపోతే పార్టీ ఉనికి దెబ్బతింటుందని మరికొంతమంది నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.