టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి తృటిలో పెను ప్రమాదం తప్పింది.ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ కి ఆవు అడ్డు రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం వద్ద చోటు చేసుకుంది.ఎదురుగా వస్తున్నా ఆవును తప్పించబోయి డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగింది అని వెల్లడించారు.
అయితే ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడంతో కాన్వాయ్లోని ముందున్న ఎస్కార్ట్ వాహనాన్ని చంద్రబాబు ప్రయాణం చేస్తున్న వాహనం బలంగా ఢీ కొట్టింది.అయితే బాబు వాహనం బుల్లెట్ ప్రూఫ్ కావడంతో ఆయన ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డారు.
ఇక ఈ ప్రమాదంలో సిబ్బందికి స్వల్ప గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు.ఈ ప్రమాదం అమరావతి నుండి హైదరాబాద్ వస్తుండగా చోటు చేసుకుంది.
అయితే ప్రమాదంలో పెద్దగా ఎవరికీ గాయాలు కాకపోవడంతో సిబ్బంది ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు.ఈ ఘటన అనంతరం మళ్ళీ కాన్వాయ్ లో చంద్రబాబు హైదరాబాద్కు బయలుదేరారు.