పంచాయతీ ఎన్నికలలో చంద్రబాబు పార్టీ పరిస్థితి పూర్తిగా కనుమరుగయ్యారు వచ్చిన ఫలితాలు రావడంతో ఏపీలో టీడీపీ పని అయిపోయినట్లే అనే టాక్ వినపడుతుంది.ఇలాంటి తరుణంలో పంచాయతీ ఎన్నికలలో అధికార పార్టీ పోలీసుల చేత డబ్బు చేత అధికారం ఉపయోగించి గెలిచిందని టిడిపి నేతలు వచ్చిన ఫలితాలపై సమర్ధించుకుంటూ ఉన్నారు.
కుప్పంలో ఓడిపోవడం విషయంలో చంద్రబాబు కూడా ప్రభుత్వంపై ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది.
ఇలాంటి తరుణంలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు వైసీపీ మద్దతుదారులు గెలుచుకున్న క్రమంలో చంద్రబాబు కుప్పం పర్యటన ఏపీ లో టెన్షన్ వాతావరణాని పుట్టిస్తోంది.
హైదరాబాద్ నుంచి బెంగళూరు కి ఆ తర్వాత అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా కుప్పం కి చంద్రబాబు చేరుకోబోతున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే పర్యటనలో టిడిపి క్యాడర్ తో పాటు కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం కాబోతున్నారట.
కాగా కుప్పం లో చంద్రబాబు పర్యటన క్రమంలో వైసిపి పార్టీ కార్యకర్తలు.చంద్రబాబు ఫ్లెక్సీలను ఇటీవల కాల్చెయటంతో .కుప్పం పర్యటన టెన్షన్ వాతావరణాన్ని ఏపీ పాలిటిక్స్ లో పుట్టిస్తోంది.
.