చంద్రబాబుకు పేదలంటే కోపం, చిరాకు..: మంత్రి సిదిరి అప్పలరాజు

శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సామాజిక సాధికార యాత్ర బహిరంగ సభ జరిగింది.ఈ సభలో పాల్గొన్న మంత్రి సిదిరి అప్పలరాజు టీడీపీపై తీవ్రంగా ధ్వజమెత్తారు.

 Chandrababu Is Angry And Frustrated With The Poor: Minister Sidiri Appalaraju-TeluguStop.com

టీడీపీ అధినేత చంద్రబాబుకు పేదలంటే కోపం, చిరాకని మంత్రి సిదిరి తెలిపారు.గతంలో మత్స్యకారుల తొక్కతీస్తాం, తోలు తీస్తామన్నారు.

నాయి బ్రాహ్మణులకు తోకలు కట్ చేస్తామన్నారని మండిపడ్డారు.అలాగే బీసీలు జడ్జీలుగా పనికిరారని చంద్రబాబు లేఖ రాశారన్న విషయాన్ని గుర్తు చేశారు.

దళితులుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అని అన్న వ్యక్తి చంద్రబాబని పేర్కొన్నారు.ప్రజలను అవమానించడమే కాకుండా విద్య, వైద్యాన్ని కార్పొరేట్ మయం చేసి తన వాళ్లకు కట్టబెట్టారని చెప్పారు.

శ్రీకాకుళం జిల్లాకు కింజారపు కుటుంబం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube