‘ఆకాశ వీధిలో అందాల జాబిలి….’ అనే పాటను ఆంధ్రప్రదేశ్లోని కడప ప్రజలు ‘ఆకాశ వీధిలో అందాల విమానం…’ అంటూ పాడుకుంటున్నారు.అవును…కడపలో విమానాశ్రయం ప్రారంభమైంది.రాయలసీమలో ఇప్పటివరకు తిరుపతిలోనే విమానాశ్రయం ఉంది.
అది త్వరలో అంతర్జాతీయ విమానాశ్రయం కాబోతుండగా, కడపలో దేశీయ విమానాశ్రయం ప్రారంభమైంది.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీన్ని ప్రారంభించారు.
కేంద్ర విమానాయాన శాఖ మంత్రి అశోక్గజపతి రాజు, మరో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సమక్షంలో ఈ విమానాశ్రయం ప్రారంభమైంది.మొదటి విమానం బెంగళూరు నుంచి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్లో ఇది ఐదో విమానాశ్రయం.ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విమాన సౌకర్యం కల్పించడంలో భాగంగా ఎయిర్పోర్్ట్స అథారిటీ ఆఫ్ ఇండియా నలభైరెండు కోట్ల రూపాయల ఖర్చుతో ఈ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసింది.
కడప నుంచి మొట్టమొదటిసారి సర్వీసులు నడిపేందుకు ఎయిర్ పెగాసస్ సిద్ధమైంది.బెంగళూరు నుంచి వచ్చిన విమానం ఈ సంస్థకు చెందినదే.
కడప విమానాశ్రయం కోసం ఐదొందల ఎకరాల భూమి రాష్ర్ట ప్రభుత్వం కేటాయించింది.భవిష్యత్తులో దీన్ని మరింత విస్తరిస్తారట.