ఆర్ధిక ఇబ్బందుల కారణంగా సొంతగా ఎద్దులు కొనుక్కోలేక, ట్రాక్టర్ అద్దె చెల్లించలేక కూతుళ్ళ సాయంతో అరక దున్నిన రైతు ఉదాంతం సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయ్యిందో అందరికి తెలిసిందే.ఇక ఈ ఘటనపై నటుడు సోనూసూద్ స్పందించి వారికి సాయం చేస్తానని మాట ఇచ్చి సాయంత్రానికి వాళ్ళ ఇంటికి ట్రాక్టర్ ని పంపించాడు.
ఇక ఆ ఇద్దరు అమ్మాయిలు బాగా చదువుకోవాలని సలహా ఇచ్చాడు.వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చాడు.
ఇక దీనిపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు స్పందించారు. చిత్తూరు జిల్లా రైతు నాగేశ్వరరావు కుటుంబం పట్ల సోనూ సూద్ ఎంతో ఆపేక్ష ప్రదర్శించి ట్రాక్టర్ ను అందించడం అభినందనీయమని తెలిపారు.
సోనూ సూద్ తో మాట్లాడానని ఈ సందర్భంగా చంద్రబాబు ట్విట్టర్ లో వెల్లడించారు.ఆ కుటుంబ పరిస్థితి తనను కదిలించి వేసిందని, రైతు నాగేశ్వరరావు ఇద్దరు కుమార్తెల చదువుల బాధ్యతలను తాను స్వీకరిస్తానని హామీ ఇచ్చారు.
వారి కలల సాకారానికి తనవంతు తోడ్పాటు అందిస్తానని పేర్కొన్నారు.చంద్రబాబు వ్యాఖ్యలపై సోనూ సూద్ వెంటనే ట్విట్టర్ లో స్పందించారు.థ్యాంక్యూ సర్ అంటూ వినయంగా బదులిచ్చారు.మీ దయాగుణం ఎవరికైనా స్ఫూర్తి కలిగిస్తుంది.
ముందుకొచ్చి సాయపడేలా ప్రేరణ కలిగిస్తుంది అని అన్నారు.మీ మార్గదర్శకత్వంలో లక్షలమంది తమ కలల సాకారం దిశగా పయనిస్తున్నారు.
మీరు ఇలాగే ఆదర్శప్రాయంగా నిలవాలని కోరుకుంటున్నాను.త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను సర్ అంటూ సోనూ వ్యాఖ్యానించారు.
ఇప్పుడు చంద్రబాబుపై సోనూసూద్ చేసిన ఈ వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.