ఏపీలో ఇప్పుడు టీడీపీ మీద వైసీపీ నుంచి వరుచుకు పడే వారిలో ప్రధానంగా వినిపించే పేరు కొడాలి నాని. చంద్రబాబు లేదా లోకేష్ పేరు ఎత్తితేనే ఆయన ఒంటికాలిమీద లేస్తుంటారు.
చాలా దారుణ మైన కామెంట్లు చేస్తూ రెచ్చగొడుతుంటారు.అందుకే ఆయన మీద టీడీపీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం మీద ఉంది.
ఈ సారి ఎలాగైనా నానిని ఓడించాలంటూ కసి మీద ఉంది టీడీపీ.ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కూడా ఆయన విషయంలో చాలా సీరియస్ గా ఉందని తెలుస్తోంది.
ఆయన్ను ఓడించేందకు పక్కా ప్లాన్ కూడా వేస్తున్నారంట చంద్రబాబు.మిగతా నియోజకవర్గాల కంటే కూడా గుడివాడ మీదే స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.
వాస్తవానిఇ గుడివాడలో నానిని ఢీకొట్టేందుకు టీడీపీకి బలమైన క్యాండెట్ లేరనేది జగమెరిగిన సత్యం.గ్రౌండ్ లెవల్లో పట్టులేకుండా నానిని ఓడించాలంటే కష్టం.గతంలో 2004తో పాటుగా 2009లో జరిగిన వరుస ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి నాని గెలిచాడు.ఆ సమయంలో టీడీపీకి చాలా పట్టు ఉండేది గుడివాడలో.
కానీ నాని వైసీపీలోకి జంప్ చేసేసిన తర్వాత ఆయన వెంటే టీడీపీ కేడర్ కూడా వైసీపీలోకి వెళ్లిపోయింది.ఇక వైసీపీ నుంచి కూడా వరుసగా రెండుసార్లు గెలిచారు.
గత ఎన్నికల్లోనే టీడీపీ నుంచి అవినాష్ ను పోటీ చేయించినా ఓటమి తప్పలేదు.
అందుకే ఈసారి సమాజిక వర్గీకరణ వేసుకుని మరీ రంగంలోకి దిగుతున్నారు.గుడివాడలో కాపు ఓట్లు చాలా ఎక్కువ.అందుకే ఈసారి కాపు వర్గానికి ఓ బ్రాండ్ గా వెలుగు వెలుగుతున్నటువంటి వంగవీటి రాధాను తీసుకురావాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
చంద్రబాబు కమ్మ కాబట్టి ఆటు కమ్మ ఓట్లతో పాటు ఇటు కాపు ఓట్లు కూడా పడితే టీడీపీ కచ్చితంగా గెలిచే ఆస్కారం ఉంటుందని అనుకుంటున్నారంట.ఇక రాధాను బరిలోకి దించితే జిల్లా వ్యాప్తంగా ఉన్న వంగవీటి రంగా అభిమానులు కూడా టీడీపీవైపు మళ్లే అవకాశం ఉంటుందని ఆలోచిస్తున్నారంట చందబ్రాబు.