“లోకేష్” పోటీ చేసే స్థానం ఇదే...“ ఫిక్స్” చేసిన చంద్రబాబు

ఏపీలో ఎన్నికల హీట్ రోజు రోజు కీ పెరిగిపోతోంది.ప్రధాన పార్టీలు అయిన తెలుగుదేశం , వైసీపి లు ఇప్పటికే అభ్యర్ధుల ఎంపిక స్థానాలపై ఒక నిర్ణయానికి వచ్చేశారు అయితే కీలకమైన నేతల విషయంలో తర్జన బర్జన పడుతున్నారు.

 Chandrababu Fix Lokesh Mla Constituency-TeluguStop.com

అయితే జూన్ నెలాఖరుకల్లా అన్ని స్థానాలని ఫిక్స్ చేయడానికి గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.ఈ క్రమంలోనే చంద్రబాబు లోకేష్ ని ఎక్కడి నుంచీ పోటీ చేయించాలి అనే సందిగ్ధంలో ఉన్నారట.

ఇప్పుడు సర్వాత్రా లోకేష్ పోటీ చేసే స్థానం పైనే చర్చ నడుస్తోంది.

లోకేష్ ని ఎమ్మెల్సీ చేసి ఆపై మంత్రి వర్గ విస్తరణలో మంత్రిని చేసిన చంద్రబాబు వచ్చే ప్రత్యక్ష ఎన్నికల్లో తన కొడుకు మొదటి సారిగా పోటీ చేస్తుండటంతో తీవ్ర సందిగ్ద్దానికి లోనవుతున్నారట అయితే చంద్రబు ఎప్పటిలాగానే తన స్థానం అయిన కుప్పం నుంచీ పోటీ చేస్తున్నారు.

పోనీ లోకేష్ మామ బాలయ్య నియోజకవర్గం నుంచీ పోటీ చేయించాలి అనుకుంటే బాలయ్య ఆస్థానం మీద ఆశక్తి చూపుతున్నారట.దాంతో చంద్రబాబు లోకేష్ కోసం ఒక స్థానాన్ని ఫిక్స్ చేసుకున్నారట.

ఇంతకీ ఎక్కడ నుంచీ లోకేష్ ని పోటీ చేయిస్తున్నారు అంటే.

లోకేష్ కోసం చంద్రబాబు పెనమలూరు ని సిద్దం చేస్తున్నారట… పెనమలూరు కి గత ఎన్నికల్లో గోదావరి జిల్లాలో ఎక్కడా లేని విధంగా 31,000 పై చీలుకు మెజారిటీ వచ్చింది ఈ నియోజకవర్గంలో ఏకంగా కాపుల ఓటింగ్ శాతం 50,000 ఉండటంతో లోకేష్ ని ఇక్కడి నుంచీ పోటీ చేయిస్తేనే గెలుపు సునాయాసనంగా ఉంటుందనేది చంద్రబాబు ప్లాన్ గా తెలుస్తోంది.అయితే పెనమలూరులో తిరుగులేని నేతగా ఉన్న బోడె ప్రసాద్ ఉండగా ఆయన్ని తప్పించి లోకేష్ ని పెట్టడానికి గల కారణం కూడా చంద్రబాబు సిద్దం చేశారట.అదేంటంటే.

బోడె ప్రసాద్ తన నియోజక వర్గ ప్రజల సమస్యలని పరిష్కరించడంలో విఫలం అయ్యారనే చంద్రబాబు చేయించే రిపోర్ట్ తేలిందట.ఎన్నికల్లో తానూ ఇచ్చిన హామీ ప్రకారం పేదలకి పక్కా ఇల్లు నిర్మించడంలో కానీ.

పెనమరూలు లోకి వెళ్ళే వంతెన నిర్మాణం విషయంలో ఇచ్చిన హామీ ఇప్పటికి కూడా ఒక ఇంచ్ కూడా ముందుకు వెళ్ళక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.ఇదేమని అడిగితే ప్రభుత్వంలో ఉన్న ఏమ్మేలే తనకి అధికారులు సహకరించడంలేదు అని చెప్పడం విడ్డూరంగా ఉందని అంటున్నారని తేలిందట.

అంతేకాదు ఇళ్ళ విషయంలో వివరణ అడిగితే టెండర్లు వేయిస్తున్నాము అని చెప్పిందే చెప్తున్నారట…ఈ కారణాల వలన అక్కడ ప్రజలకి బోడె ప్రసాద్ పైన నమ్మకం పోయిందని సర్వేలో తేలడంతో చంద్రబాబు కొత్త అభ్యర్ధిగా లోకేష్ ని అక్కడ ఫిక్స్ చేస్తున్నారని తెలుస్తోంది.లోకేష్ అయితే చంద్రబాబు కొడుకుగా.

మంత్రిగా ఇప్పటికే తానెంతో ప్రూవ్ చేసుకున్నారని పైగా కమ్మ సామజిక వర్గం కూడా ఎక్కువగా ఉండటంతో గెలుపు సునాయసనం అవుతుందని చంద్రబాబు డిసైడ్ అయ్యారట.మరి ఇంతకాలం కష్టపడిన బోడె ప్రసాద్ కి ప్రభుత్వం వచ్చిన తరువాత నామినేటెడ్ పోస్టు ఇస్తారనే టాక్ వినిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube