టీడీపీ అధినేత చంద్రబాబు… టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మధ్య మాటల వార్ ముదిరింది.తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ప్రతి సభలోనూ… సమావేశంలోనూ ఒకరిని ఒకరు విమర్శించుకుంటూనే ఉన్నారు.
అయితే ఇప్పుడు ఈ వార్ ట్విట్టర్ వరకు చేరింది.కేసీఆర్ దళితులకు మూడెకరాల భూమి ఇస్తానంటే నేను ఎక్కడ అడ్డుపడ్డానో చెప్పాలని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు.
ఆదివారం ట్విట్టర్ వేదికగా తెలంగాణ సీఎం కేసీఆర్పై పలు విమర్శలు చేశారు.తెలంగాణ అభివృద్ధికి ఎక్కడ అడ్డుపడ్డానో కేసీఆర్ సమాధానం చెప్పాలని, తన పాలనలో ఘనంగా చెప్పుకునేలా కేసీఆర్ ఒక్క పనైనా చేశారా? అంటూ ప్రశ్నించారు.ఇచ్చిన మాట తప్పి తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్న కేంద్రాన్ని కేసీఆర్ ఒక్కసారైనా నిలదీశారా? అని అన్నారు.హైదరాబాద్ను అభివృద్ధి చేసిన నాపై విమర్శలు ఎందుకని, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎప్పుడూ చెప్పే అచ్చేదిన్ నాలుగున్నరేళ్లలో ఎక్కడా కనిపించలేదన్నారు.