ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల విషయంలో అధికార పార్టీ వైసిపి -టిడిపి పార్టీల మధ్య వాతావరణం యుద్ద వాతావరణాన్ని తలపిస్తోంది.ఇప్పటికే టిడిపి పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ని పోలీసులు అరెస్టు చేయడం జరిగితే తాజాగా కృష్ణా జిల్లాకు చెందిన కీలక నేత టిడిపి పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి పై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడటం సంచలనంగా మారింది.
పూర్తి విషయంలోకి వెళ్తే పట్టాభి ఉదయం తన వాహనంలో ఇంటికి వెళ్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై దాడికి పాల్పడటమే కాకా.కారు డ్రైవర్ ని కూడా కొట్టినట్లు.
ఈ ఘటనలో కారు అద్దాలు తో పాటు.
సెల్ ఫోన్ ధ్వంసం అయినట్లు ఆయన చెప్పుకొచ్చారు.
అంతేకాకుండా దాడిలో కాలికి రాడ్ దెబ్బ తగిలినట్లు చూపించారు.ఈ క్రమంలో ప్రజల పక్షాన పోరాడుతున్న తరుణంలో ఇలా ప్రతిపక్షాలపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడటం సబబేనా అని ప్రశ్నిస్తున్నారు.
ఎవరు ఎన్ని దాడులు చేసినా ప్రజల పక్షాన పోరాడుతాం అంటూ ఈ సందర్భంగా పట్టాభి పేర్కొన్నారు.అంతమాత్రమే కాకుండా ఈ దాడి పై డీజీపీ సమాధానం చెప్పాలని, అంతకుముందే తన కారు పై దాడి జరిగిందని ఇంతవరకు చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే ఈ ఘటన జరగడం తో పఠాభి ని పరామర్శించడానికి చంద్రబాబు రావటం మాత్రమే కాక కృష్ణాజిల్లాలో కీలక నేతలు రావడం జరిగింది.
.