అధికార పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీలో రానున్న ఎన్నికలకి పోటీ చేయబోయే అభ్యర్ధులని నియోజక వర్గాల వారీగా ప్రకటిస్తూ వస్తున్నారు.ఇప్పటికే చిత్తూరు, కడప, నెల్లూరు, గుంటూరు, కృష్ణ, ఒంగోలు జిల్లాల పరిధిలో అసెంబ్లీ అభ్యర్ధులని చాలా వరకు ప్రకటించిన చంద్రబాబు తాజాగా రాజమండ్రి నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్ధులని ప్రకటించారు.
రాజానగరం అభ్యర్ధిగా పెందుర్తి వెంకటేష్, రాజమండ్రి రూరల్ అభ్యర్ధిగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గోపాలపురం సిట్టింగ్ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుని చంద్రబాబు ప్రకటించారు.ఇక రాజమండ్రి ఎంపీగా మురళీమోహన్ పోటీ చేయడానికి ఆసక్తి చూపించకపోవడంతో చంద్రబాబు ముగ్గురు అభ్యర్ధుల పేర్లు పరిశీలిస్తున్నారు.
అయితే వాళ్ళు ముగ్గురు పోటీకి ఆసక్తి చూపించడంతో చంద్రబాబు ఇంకా ఫైనల్ నిర్ణయం తీసుకోలేదు.మిగిలిన నియోజకవర్గాల పరిధిలో కూడా అభ్యర్ధులని కర్నూల్ పర్యటన తర్వాత ప్రకటిస్తారని తెలుస్తుంది.