ఏపీ రాజకీయాలో ఎన్నికల ప్రచారానికి టీడీపీ అధినేత చంద్రబాబు తిరుపతి వేదికగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.ఇక ఈ ఎన్నికల ప్రచారంలో ఎన్నికల శంఖారావ సభలో పాల్గొన్నారు.
ఈ సభలో టీడీపీ కార్యకర్తల నుంచి ఉద్దేశించి ప్రసంగిస్తున్న చంద్రబాబు మోడీ సర్కార్ మీద, కేసీఆర్ మీద అలాగే వైసీపీ పార్టీ మీద విమర్శలు ఎక్కుపెట్టారు.కేంద్ర ప్రభుత్వం సహకరించాకపోయిన తాను ఏపీని అభివృద్ధి పథంలో తీసుకెళ్తుంటే తానపై ముప్పేట దాడి చేసారని వాఖ్యలు చేసారు.
దీనికి కేసీఆర్ వైసీపీ పార్టీ వెనకుండి నడిపిస్తున్నారని విమర్శలు చేసారు.
తాజాగా వైసీపీ కొత్త రాజకీయం మొదలెట్టిందని.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకి గురైతే సాక్ష్యాలు తారుమారు చేసి హార్ట్ అటాక్ అని నమ్మించే ప్రయత్నం చేసారని, అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో హత్య అని నిర్ధారణ అయిన తర్వాత ప్లేట్ మార్చి టీడీపీ మీద విమర్శలు మొదలెట్టారని, రాజకీయ లబ్ది కోసం తామే హత్య చేయించామని వాఖ్యలు చేస్తున్నారు.దీనిపై పోలీసులతో విచారణ చేయిస్తే సిబిఐ ఎంక్వయిరీ అడుగుతున్నారని, తామే సాక్ష్యాలు మార్చేసి తామే హత్యలు చేయించి సానుభూతి ఓటు బ్యాంకు కోసం ప్రయత్నం చేయాలని దీనిని ప్రజలందరూ గ్రహిస్తున్నారని చంద్రబాబు వాఖ్యలు చేసారు.
వైసీపీ హత్య రాజకీయాలని ప్రజలు ఎంత మాత్రం ప్రోత్సహించకూడదు అని కోరారు.