ముఖ్యమంత్రి కాన్వాయ్ వస్తోంది అంటే ఎంత వేగంతోనో ఒస్తాయి , చాలా జాగ్రత్తగా ఉండాలి మరి.అలాగే తాము ప్రయాణించే దారి ఎలాంటిదో చూసుకుని మరీ బద్రతా సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలి.
ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ఇటు ముఖ్యమంత్రి కీ అటు సామన్యులకీ భారీగా నష్టం వాటిల్లుతుంది.అధికారులూ – పోలీసుల లోపం వలన ఒక దారుణం జరిగింది.
ఏపీ లో చోటు చేసుకున్న ఈ ఘటన లో ముఖ్యమంత్రి కాన్వాయ్ వాహనం గుద్దేయ్యడం తో ఒక వ్యక్తి ప్రనాలో పోయాయి.ఏపీ తాత్కాలిక సచివాలయ శంకుస్థాపన కోసం మూడు రోజుల క్రితం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెలగపూడికి వెళ్లిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా విజయవాడలోని ఎంజీరోడ్డు నుంచి రాజగోపాలాచారి రోడ్డులో వెళుతున్న సీఎం బాబు కాన్వాయ్ వాహనం ఒకటి.సైకిల్ మీద వెళుతున్న ఒక వ్యక్తిని బలంగా ఢీ కొట్టింది.
దీంతో.తీవ్రగాయాలు అయిన సదరు వ్యక్తి (పోస్టల్ అసిస్టెంట్ బి.నాగేంద్ర వరప్రసాద్)ని ఆసుపత్రికి తరలించారు.ఆయన ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మరణించారు.
అధికారులని కొందరు ఈ విషయం లో వేలు చూపిస్తున్నారు.సీఎం కాన్వాయ్ వెళ్లే సమయంలో విధులు నిర్వహించే పోలీస్ కానిస్టేబుళ్లు బాధ్యతగా వ్యవహరించి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని చెబుతున్నారు.
సీఎం కాన్వాయ్ వెళుతున్న రోడ్లకు ఇరువైపు పెద్ద ఎత్తున భద్రతా సిబ్బందిని మొహరిస్తారు.వారు కాన్వాయ్ వస్తున్న విషయాన్ని గుర్తించి.
రాకపోకల్ని అడ్డుకొని ఎలాంటి ప్రమాదం జరగకుండా చూస్తుంటారు.