మోడీ, కేసీఆర్ ఆర్ధిక టెర్రరిస్ట్ లుగా మారారు! చంద్రబాబు ఘాటు వాఖ్యలు!

ఏపీలో ప్రతిపక్ష పార్టీ వైసీపీని అడ్డు పెట్టుకొని మోడీ, కేసీఆర్ లు తనని కుట్ర పూరితంగా అధికారంకి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని, ఏపీ సిఎం చంద్రబాబు ఘాటు వాఖ్యలు చేసారు.తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సపోర్ట్ రాకున్న ఏపీని తన కష్టంతో అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నా అని, ప్రజలు అందరూ ఇప్పుడు తనకి అండగా వున్నారని, ఇలాంటి టైంలో కుట్రలకి తెరతీస్తూ టీడీపీకి సపోర్ట్ గా వున్నా వారి ఓట్లు తొలగించే ప్రయత్నం వైసీపీ చేస్తుందని, ఈ విషయాన్ని జగన్ స్వయంగా ఒప్పుకున్నాడని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

 Chandrababu Controversial Comments On Jagan And Kcr-TeluguStop.com

వైసీపీ కుట్రకి తెలంగాణ ప్రభుత్వం సపోర్ట్ చేస్తుందని, అసలు ఏపీలో జరుగుతున్న సంఘటనలపై కేసీఆర్ పోలీస్ విచారణ చేయడం సిట్ ని రాజ్యాంగంలో ఎ సెక్షన్ క్రింద వేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేసారు.అలాగే ఏపీని ఆర్ధికంగా దెబ్బ తీసే కుట్రలో జగన్, కేసీఆర్, మోడీ భాగస్వాములు అయ్యారని, వారి కుట్రలకి ప్రజలే బుద్ధి చెబుతారని చంద్రబాబు పేర్కొన్నారు.

దేశంలో వీళ్ళు ఆర్ధిక టెర్రరిస్ట్ లుగా వ్యవహరిస్తున్నారని, చంద్రబాబు ఘాటు విమర్శలు చేసారు.ఇక ఓట్ల తొలగింపు, డేటా చోరీలో అందరి కుట్రలు బయటపడతాయని, దొంగతనం చేసి మళ్ళీ తమ మీద ఫిర్యాదు చేయడం కరుడుగట్టిన నేరస్తులు చేసే పని అని విమర్శించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube