జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దుండగుల కాల్పుల్లో మృతి చెందటం తెలిసిందే.ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా ఆయనపై దుండగులు కాల్పులు జరిపారు.
దీంతో తీవ్ర గాయాలు పాలైన షింజో అబే నీ నారా మెడికల్ యూనివర్సిటీ హాస్పిటల్ కి తరలించారు.వైద్యులు కాపాడటానికి అన్ని రకాల కృషిచేసిన.
ఫలితం లేకుండా పోయింది తుది శ్వాస విడిచారు.
ఈ క్రమంలో షింజో అబే మృతి పట్ల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
షింజో అబే మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాను.ఒక మంచి నాయకుడు.షింజో అబే.జపాన్ దేశాన్ని అద్భుతంగా అభివృద్ధిలో నడిపించారు.అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి స్నేహితుడు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం.నేను తీసుకున్న అనేక నిర్ణయాలను ఆయన నమ్మారు.అటువంటి నాయకుడు మరణించడం బాధాకరం.
ఆయన కుటుంబానికి అదే విధంగా జపాన్ దేశ ప్రజలకు ప్రగాఢ సానుభూతి అంటూ చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు.