జపాన్ మాజీ ప్రధాని మృతికి చంద్రబాబు సంతాపం..!!

జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దుండగుల కాల్పుల్లో మృతి చెందటం తెలిసిందే.ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా ఆయనపై దుండగులు కాల్పులు జరిపారు.

 Chandrababu Condoles The Death Of Former Japanese Prime Minister Details, Chandr-TeluguStop.com

దీంతో తీవ్ర గాయాలు పాలైన షింజో అబే నీ నారా మెడికల్ యూనివర్సిటీ హాస్పిటల్ కి తరలించారు.వైద్యులు కాపాడటానికి అన్ని రకాల కృషిచేసిన.

ఫలితం లేకుండా పోయింది తుది శ్వాస విడిచారు.

ఈ క్రమంలో షింజో అబే మృతి పట్ల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

షింజో అబే మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాను.ఒక మంచి నాయకుడు.షింజో అబే.జపాన్ దేశాన్ని అద్భుతంగా అభివృద్ధిలో నడిపించారు.అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి స్నేహితుడు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం.నేను తీసుకున్న అనేక నిర్ణయాలను ఆయన నమ్మారు.అటువంటి నాయకుడు మరణించడం బాధాకరం.

ఆయన కుటుంబానికి అదే విధంగా జపాన్ దేశ ప్రజలకు ప్రగాఢ సానుభూతి అంటూ చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube