మొన్నటి ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీపై సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాటు, మరోసారి మోడీ ప్రధాని కాకుండా తీవ్రంగా ప్రయత్నాలు చేసిన వ్యక్తి చంద్రబాబు అనడంలో ఎలాంటి సందేహం లేదు.గతంలో ఎప్పుడు లేని విధంగా కాంగ్రెస్తో కూడా కలిసి పని చేసి మోడీని దించేందుకు తీవ్రంగా శ్రమించాడు.
కాని ప్రజలు మాత్రం మోడీకే మళ్లీ పట్టం కట్టారు.ఏపీలో చంద్రబాబు నాయుడు అధికారం నుండి ప్రజలు తొలగించి వైఎస్ జగన్కు అధికారంను కట్టబెట్టిన విషయం తెల్సిందే.
మోడీతో పెట్టుకోవడం వల్లే చంద్రబాబుకు ఈ పరిస్థితి వచ్చిందంటూ కొందరు విశ్లేషించే వారు లేకపోలేదు.
ఎన్నికల తర్వాత మోడీ విషయంలో చంద్రబాబు నాయుడు కాస్త మౌనం పాటిస్తున్నట్లుగా అనిపిస్తుంది.
ప్రధాని నరేంద్ర మోడీకి చంద్రబాబు నాయుడు భయపడుతున్నాడని కామెంట్స్ వస్తున్నాయి.ఇలాంటి సమయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి.
వైజాగ్లో పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన బాబు తనకు మోడీతో ఎలాంటి వ్యక్తిగత విరోధం లేదన్నాడు.గతంలో రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాను మోడీని ఢీ కొట్టినట్లుగా చెప్పుకొచ్చాడు.
రాష్ట్రంకు కావాల్సిన, రావాల్సిన నిధులను దక్కించుకునేందుకు ఆయనతో విరోధం పెట్టుకున్నట్లుగా పేర్కొన్నాడు.రాష్ట్రం కోసం నేను ఆయన్ను ఎదిరించినట్లుగా చెప్పాడు.
అంతే తప్ప ఆయన వల్ల నాకు వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బంది లేదన్నాడు.