ఓట్ల తొలగింపు కుట్రలో జగన్ మొదటి ముద్దాయి! చంద్రబాబు విమర్శలు!

ఏపీలో ఇప్పుడు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఓట్ల తొలగింపు కుట్ర వివాదం తారాస్థాయికి చేరుకుంది.డేటా చోరీ చేసి అధికార పార్టీ ఓట్ల తొలగింపు కుట్రకి తెరతీస్తుంది అని వైసీపీ ఆరోపిస్తూ వుంటే ప్రతిపక్ష పార్టీ ఫారం 7 ఉపయోగించుకొని అక్రమంగా ఓట్ల తొలగింపుకి పాల్పడుతుంది అని అధికార పార్టీ ఆరోపిస్తుంది.

 Chandrababu Comments On Jagan In Votes Gambling-TeluguStop.com

దీంతో రెండు పార్టీల మధ్య ఇప్పుడు ఓట్ల రగడ, మరో వైపు దీనిపై పోలీస్ కేసులతో ఆద్యంతం ఉత్కంట వాతావరణం నెలకొని వుంది.ఇదిలా వుంటే తాజాగా ఏపీ ముఖ్యమంత్రి నియోజకవర్గాల సమీక్షా సమవేశంలో వైస్పీ అధినేత జగన్ పై విమర్శలు చేసారు.

ఓట్ల తొలగింపు కుట్ర లో ఎ1 నిందితుడు వైఎస్ జగన్ అని ముఖ్యమంత్రి ఆరోపణలు చేసారు.ఓట్ల తొలగింపుకి ఫారం7 ఉపయోగించుకున్నామని జగన్ స్వయంగా ఒప్పుకోవడం చూసుకుంటే అధికారంలోకి రావడానికి జగన్ ఎలాంటి కుట్ర చేసాడో తెలుస్తుంది అని చంద్రబాబు ఆరోపించారు.

ఇక వైసీపీ టీడీపీ సానుబూతి పరుల ఓట్లని టార్గెట్ గా చేసుకొని కేసీఆర్ తో కలిసి ఈ కుట్రకి తెరతీసింది అని విమర్శించిన జగన్, ఇదంతా హైదరాబాద్, బెంగుళూరు కేంద్రంగా నడుస్తుంది అని చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube