మేము చేస్తే సంసారం …పక్కవాళ్ళు చేస్తే వ్యభిచారం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.తాను మొన్నటివరకు అంటకాగిన బీజేపీతో వైసీపీ , జనసేన పార్టీలు అంటకాగడం బాబు లో అసహనాన్ని పెంచుతున్నాయి.
తాము నాలుగేళ్లపాటు తిరిగినప్పుడు అనిపించని.కనిపించని లోపాలాన్ని ఇప్పుడు బాబు కి ఆ రెండు పార్టీలు బీజేపీతో తిరగడంతో అనిపిస్తున్నాయి.
టీడీపీ అధినేత తీరు ఎలా ఉందంటే.బీజేపీతో ఎవరూ పొత్తు పెట్టుకోకూడదు.ఎవరూ ఆ పార్టీకి మద్దతు ఇవ్వకూడదు ఆలా చేస్తే వారు ఏపీకి ద్రోహం చేసినట్టే అనే ఫీలింగ్ లో బాబు అండ్ కో బృందం ఉన్నారు.చంద్రబాబు నాయుడితో బాగుంటే.
ఇటలీ దెయ్యం అయినా.ఇంటికి వెలుగవుతుంది.
మరి చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ బీజేపీ, టీఆర్ఎస్, కమ్యూనిస్ట్ పార్టీలు,జనసేన,రాష్ట్రంలోని చిన్నాచితక పార్టీలన్నింటితో జతకట్టింది అంతెందుకు టీడీపీ కి ఆజన్మ విరోధి అయిన కాంగ్రెస్ తో బాబు చేయికలపడానికి కూడా సిద్ధం అయ్యారు .కానీ ఇదంతా ఏపీ అభివృద్ధి కోసమే అన్నట్టు టీడీపీ కవరింగ్ చేసుకుంటోంది.
కొంతకాలం క్రితం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రధాని మోదీని కలిస్తే.అదేదో మహా పాపం అయినట్లు రచ్చరచ్చ చేశారు.మోదీని, కేంద్రమంత్రులను కలవడానికి ప్రయత్నిస్తున్నాడు ఇది మాహా ఘోరం .అన్యాయం అన్నట్టుగా ప్రచారం చేశారు.మరి ఒక ఎంపీ, అలాగే ప్రధాని స్థాయి వ్యక్తి ఎవరిని కలవాలి ఎవరిని కలవకూడదు అనేది కూడా టీడీపీ వారే డిసైడ్ చేసేస్తున్నారు.తాజాగా .వైసీపీ అధినేత జగన్ టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి, ఎంపీ మురళీ మోహన్ పై విమర్శలు గుప్పిస్తే.దానికి సమాధానం చెప్పాల్సింది పోయి.
వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యాన్నారాయణను కలిశారని ప్రచారం చేశారు.విమర్శలకు సమాధానం చెప్పడం మానేసి ఎదురుదాడి చెయ్యడం టీడీపీ కి పరిపాటిగా మారింది.
పరిస్థితులకు అనుగుణంగా తనదైన రాజకీయ ఎత్తుగడలను వేయడంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడిని మించిన నేత ప్రస్తుత రాజకీయాల్లో ఎవరూ లేరు.రాజకీయాల్లో ఆయ స్టైలే వేరు.
కానీ, ఈ రోజు ఉన్న రాజకీయ నాయుకుడు.రేపు అదే పార్టీలో ఉంటారనే నమ్మకం లేదు.
రాజకీయ రంగస్థలంలోనే ఎవరైన ప్రత్యర్థులు.అవి పక్కనబెడితే అందరూ మిత్రులే ఇదే రాజకీయం అంటే.