ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణా ముఖ్యమంత్రి బెయిల్ ఇచ్చారా? విచిత్రంగా ఉంది.అవును విచిత్రమే.
రాజకీయ నాయకులు ఇలాగే చిత్ర విచిత్రంగా మాట్లాడుతారు.చంద్రబాబుకు కెసీఆర్ కండీషనింగ్ బెయిల్ ఇచ్చారంటూ విచిత్రమైన స్టేట్మెంట్ ఇచ్చిన నాయకుడు వైఎస్సార్సీపీ లీడర్ అంబటి రాంబాబు.
చంద్రబాబు దాదాపు మూడు నెలలుగా విజయవాడలోనే ఉంటున్నారు.అంటే 82 రోజుల పాటు విజయవాడలోనే బాబు నిన్ననే హైదరాబాదులోని సచివాలయానికి వచ్చారు.
అధికారులతో సమావేశం అయ్యారు.దీనిపై అంబటి రాంబాబు వ్యంగ్య విమర్శలు చేస్తూ వోటుకు నోటు కేసులో నిందితుడైన చంద్రబాబుకు సీఎమ్ కెసీఆర్ కండీషనింగ్ బెయిల్ ఇచ్చారని, అందుకే దీర్ఘ కాలం తరువాత హైదరాబాదు వచ్చారని కామెంట్ చేశారు.
బాబు మళ్ళీ విజయవాడ వెళ్ళిపోతారు కాబట్టి దీన్ని బెయిలుగా చెప్పారు రాంబాబు.అంటే విజయవాడ చంద్రబాబుకు జైలు వంటిది అన్నమాట.
సచివాలంలోని తన కార్యాలయంలో లక్షలు ఖర్చు చేసి వాస్తు మార్పులు చేయించుకున్న కొన్ని రోజులకే బాబు తన మకాం విజయవాడకు మార్చారు.దీనిపై కూడా అంబటి విమర్శలు చేశారు.
ప్రజా ధనం వృధా చేశారని అన్నారు.రాజకీయ నాయకులు విమర్శలు చేయడానికి ఏదో ఒక అంశం ఎప్పుడూ తయారుగా ఉంటుంది.