అసలు సంగతి ఏమిటి ? చెప్పలేని వ్యక్తీ ఎవరు ? అసలు సంగతి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా.దీనిపై చెప్పలేని వ్యక్తీ ఏపీ సీఎమ్ చంద్రబాబు నాయుడు.
ఈ సంగతి చెప్పిన నాయకుడు అనంతపురం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి.దివాకర్ చెప్పిన సంగతి ఏమిటంటే ….
ఆంద్ర ప్రదేశ్కు స్పెషల్ స్టేటస్ కేంద్రం ఇస్తుందా, ఇవ్వదా అనే విషయం చంద్రబాబుకు స్పష్టంగా తెలుసునని, కానీ ఆయన ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పలేరని అన్నారు.అంటే ప్రత్యేక హోదా విషయంలో బాబుకు క్లారిటీ ఉంది.
ఆయనకు అన్ని విషయాలు తెలుసు.తెలిసినప్పుడు ప్రజలను మభ్యపెట్టడం ఎందుకు? హోదా ఇవ్వడం లేదని చెప్పవచ్చుగా.కానీ ఆయన ఆ పని చేయలేడు.ఉన్న విషయం చెబితే భాజపాతో స్నేహం చెడిపోతుంది.ప్రజల్లో భాజపాతో పాటు టీడీపీ మీద కూడా వ్యతిరేకత వస్తుంది.బాబుకు అసలు సంగతి తెలిసి కూడా ప్రజలను మోసం చేస్తున్నారని దివాకర్ రెడ్డి ఉద్దేశం కావొచ్చు.