తెలంగాణను మెచ్చుకుంటున్న చంద్రబాబు ! కారణం ఇదే

ఇసుక పోరాటాన్ని ఉదృతం చేసేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు.దానిలో భాగాంగానే ఈ నెల 14 వ తేదీన విజయవాడ ధర్నా చౌక్ లో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టాడు.

 Chandrababu Appreciates To Telangana-TeluguStop.com

అంతే కాదు దీని కోసం భారీగా జనసమీకరణ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ సందర్భంగా తెలంగాణ ను మెచ్చుకుంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యానికి గురిచేశాయి.

అందరూ తెలంగాణను ఫాలో అవ్వాల్సిందిగా ఆయన పిలుపునివ్వడమే దీనికి ప్రధాన కారణం.ప్రజా సమస్యల మీద పోరాటం చేసే విషయంలో మాత్రమే బాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో ఆర్‌టిసి సమస్యపై అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు ఏకమై కలిసికట్టుగా ఉద్యమాలు చేస్తున్నాయి.ఏపీలోనూ అదే తరహాలో ఇసుక సమస్యపై పోరాడడానికి అంతా ముందుకు రావాలని బాబు పిలుపునిస్తున్నాడు.

ఇసుక విధానాన్ని జగన్ మార్చడం వల్ల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కృత్రిమ కొరత ఏర్పడిందని 30 లక్షల మంది కార్మికుల కుటుంబాలు పస్తులుండడానికి జగనే కారణం అంటూ బాబు మండిపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube