టిడిపి జాతీయ అద్యక్షుడు చంద్రబాబు నాయుడు జగన్ పైన కొడాలి నాని పై అలాగే కొంతమంది వైసీపీ మంత్రులపై విమర్శలు చేశాడు.గుడివాడలో పేకాట క్లబ్ లపై పోలీసులు దాడులు చేసిన సంగతి తెలిసిందే.
ఈ పేకాట క్లబ్ లను గుడివాడకు చెందిన వైసీపీ మంత్రి కొడాలి నాని ఆద్వర్యంలో నడుస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. పేకాట క్లబ్ లపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో కొడాలి నాని మాట్లాడుతూ పేకాట అడితే ఏమవ్వుతుంది.
మహా అయితే ఫైన్ వేస్తారని అన్నాడు.ఫైన్ కట్టి మళ్ళీ అడుతారు అని అన్నాడు.
ఈ విషయంపై చంద్రబాబు నాయుడు నాని పై ఫైర్ అయ్యాడు.వైసీపీలో బూతుల మంత్రి, పేకాట క్లబ్ లను నిర్వహించే మంత్రి, హవాలా నడిపించే మంత్రులు ఉన్నారు.పేకాట అడితే ఏమవ్వుతుందని అనడానికి సిగ్గు ఉండాలి.మహా అయితే ఫైన్ కడతారు అని అంటాడా అంటూ ఎద్దేవ చేశాడు.ఆ విషయం తెలిసిన ముఖ్యమంత్రి జగన్ కూడా సైలెంట్ గా ఉండటం మన రాష్ట్ర ప్రజలు చేసుకున్నా దౌర్భాగ్యమని అన్నాడు.