ఇటీవల చంద్రబాబు నాయుడు చాలా మంది ప్రముఖులతో కరోనా నేపథ్యంలో సాయం కోసం ఎదురు చూస్తున్న వారి విషయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రతినిధులు అదే రీతిలో మరికొంత మంది నిపుణులు పాల్గొనగా ఇదే సమావేశంలో సోనుసూద్ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సోనుసూద్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుండి సాయం చేయాలని నాకు అనేక ఫోన్ కాల్స్ రోజూ వస్తూనే ఉన్నాయని తెలిపారు.
ఇటువంటి క్లిష్ట సమయంలో కరోనా బాధితులకు సేవ చేయటం బాధ్యతగా భావిస్తున్నట్లు స్పష్టం చేశారు.
అంతమాత్రమే కాకుండా తన భార్య ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన నిజంగా సంతోషించదగ్గ విషయం అని రెండు తెలుగు రాష్ట్రాల తో ఎంతో తన జీవితానికి అనుబంధం ఉందని పేర్కొన్నారు.అదే విధంగా చంద్రబాబు పరిపాలన పై కూడా పొగడ్తల వర్షం కురిపించారు.
అటువంటి చంద్రబాబు కరోనా తో పోరాడే విషయంలో.తనని కలుపుకోవటం ఎంతో సంతోషించదగ్గ విషయం అని.సోను సూద్ పేర్కొన్నారు.
.