ఏపీలో ప్రచార హోరులో విమర్శల పర్వం! ఓ వైపు జగన్ మరో వైపు చంద్రబాబు

ఏపీలో ఎన్నికల ప్రచార హోరు ఊపందుకుంది.అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు ఎన్నికల ప్రచారంలో వరుస సభలతో దూసుకుపోతున్నారు.

 Chandrababu And Jagan Speed Up In Poll Campaign-TeluguStop.com

ఈ రోజు శ్రీకాకుళం నుంచి ఎన్నికల ప్రచాన్ని వైసీపీ అధినేత జగన్ మొదలుపెట్టగా, మరో వైపు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఈ రోజు ఉత్తరాంద్రలో మూడు జిల్లాలలో తన పర్యటనని పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నాడు.వరుస సభలతో విరామం లేకుండా ప్రచార పర్వాన్ని ఇద్దరు నేతలు పూర్తి చేస్తున్నారు.

ఈ రోజు ఉదయం పది గంటలకి ఎన్నికల ప్రచారాన్ని మొదలెట్టిన ఇద్దరు నేతలు తన ప్రసంగాలతో ప్రజలని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ ఎన్నికల ప్రచారం వైసీపీ అధినేత జగన్ మొత్తం తన ప్రసంగాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు వైఫల్యాలని ఎత్తి చూపిస్తూ, అలాగే ఈ ఐదేళ్ళు అరాచక పాలన, కుట్ర రాజకీయాలని చంద్రబాబు పెంచి పోషించారని, అలాగే తమ పథకాలని కాపీ కొట్టి ఎన్నికల ముందు ప్రజలని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని దయ్యబట్టారు.

ఇక టీడీపీ అధినేత తన ప్రచార సభలలో ఎక్కువగా ఏపీకి బీజేపీ పార్టీ చేసిన మోసాలని ఎత్తి చూపిస్తూ, మరో వైపు కేసీఆర్ వైసీపీ ఉపయోగించుకొని ఏపీపై పెత్తనం చేయాలని చూస్తుంటే అంటూ ప్రాంతీయ వైషమ్యాలు ప్రజలలో నింపి ఓటర్స్ ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.అలాగే తాను ప్రవేశం పెట్టిన సంక్షేమ పథకాలు లబ్ది పొందుతున్న అందరూ తిరిగి టీడీపీకి ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube