‘ కాపు గర్జన ‘ రాష్ట్ర రాజకీయాలలో ఒక కొత్త ఒరవడి ని సృష్టించబోతోంది ఈ మీటింగ్ అంటున్నారు విశ్లేషకులు.రేపు జరగబోతున్న ఈ మహా గర్జన కి ప్రభుత్వం తరఫున చాలా అడ్డంకులు ఎదురు అవుతున్నాయి అంటూ ఆరోపిస్తున్నారు కాపులు.
ముద్రగడ పద్మనాభం – మాజీ మంత్రి అయిన ఈయన ప్రభుత్వ నిర్ణయాలని తూర్పారబట్టడం కోసమే ఈ కార్యక్రమం చేపడుతున్నారు అనీ ఈ కార్యక్రమం లో కాపులకోసం ప్రత్యేక రాజకీయ పార్టీ ప్రకటించినా ఆశ్చర్య పోనక్కరలేదు అనీ చెబుతున్నారు.ఈ నేపథ్యంలో తన నిర్ణయాలను వ్యతిరేకిస్తూ, తప్పులు ఎత్తిచూపుతూ ముద్రగడ చేస్తున్న గర్జనకు హాజరు కావొద్దంటూ తన పార్టీలోని కాపునేతలను చంద్రబాబునాయుడు బ్రేకులు వేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
అయితే కేవలం కులం కోసం జరుగుతున్న ఈ కార్యక్రమానికి వెళ్లకుండా ఎలా ఉండగలమని, దీనివల్ల కులంలో చాలా విమర్శలు భరించాల్సి వస్తుందని కాపు నాయకులు అధినేతతో చెబుతున్నట్లు సమాచారం.
ఓటు బ్యాంకు రాజకీయాలు కులం సహాయంతో జరుగుతున్న ఈ దేశం లో అలాంటి కుల మీటింగ్ లకి హాజరు కాకపోతే భారీ ఓటు బ్యాంక్ కూడా కోల్పోతాం అని పచ్చ కాపులు అదే టీడీపీ కాపులు భయపడుతున్నట్టు సమాచారం.
ఇలాంటి పనులు చేసి కాపులలో చీలిక రావడం కోసం చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారా అనే అనుమానం కూడా లేకపోలేదు.