తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బాగా మారిపోయాడు.అవును నిజంగానే మారిపోయాడు.
గతంలో ఆయనలో కనిపించిన కాన్ఫిడెన్స్ … ఇప్పుడు కనిపించడంలేదు సరికదా … ఆయన లో ఎక్కడలేని ఆందోళన… భయం మాత్రం కొట్టచ్చినట్టు కనిపిస్తున్నాయి.అందుకే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేస్తున్న విమర్శల విషయంలో బాబు చాలా ఆందోళన పడుతున్నట్టు కనిపిస్తోంది.అందుకే… తెలంగాణ సీఎం కేసీఆర్ నిద్రలేస్తే నన్నే తిడుతున్నారు.అలా ఎందుకు చేస్తున్నారో తెలియడం లేదు.
హైటెక్ సిటీ కట్టినందుకు తిడుతున్నారో.హైదరాబాద్ను అభివృద్ధి చేసినందుకు తిడుతున్నారో చెప్పాలి.
అంటూ.బాబు మాట్లాడడం అందరికి వింతగా అనిపిస్తోంది.
మొదట్లో కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలపై ముందు అందరికి అర్ధం కాకపోయినా.ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా… కేసీఆర్ చేస్తున్న విమర్శలతో ఇటు కాంగ్రెస్, అటు టీడీపీ కూడా తీవ్రంగా దెబ్బతినడం ఖాయమని అంటున్నారు.అనుభవం ఉన్నది చంద్రబాబుకు కాదని, కేసీఆర్కేనని గతంలో ప్రధాని నరేంద్ర మోడీనే వెల్లడించిన విషయాన్ని ఈ సందర్భంగా పలువురు చెప్పడం ఇప్పుడు చర్చకు వస్తున్న అంశం.ఇక కాంగ్రెస్ తో పొత్తు విషయానికి వస్తే… నిజంగా ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం టీడీపీ ని మొదటి నుంచి అభిమానిస్తున్న వారెవ్వరికీ ఇష్టం లేదు.
కానీ బాబు మాత్రం తన రాజకీయ అవసరం కోసం దశాబ్దాల చరిత్ర ఉన్న టీడీపీ ఇమేజ్ ని డ్యామేజ్ చేసేసాడు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.మొన్న మేడ్చెల్ లో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలోనూ అదే విషయం సోనియా గాంధీ ప్రకటించింది కూడా… ప్రత్యేక హోదా ఇస్తమన్నందుకే కాంగ్రెస్ తో కలిశామని బాబు ఎంత కవర్ చేసుకున్నా.ప్రజల్లోకి మాత్రం బాబు తన రాజకీయ అవసరాల కోసమే పొత్తు పెట్టుకున్నాడు అనే సంకేతాలు వెళ్లిపోయాయి.
నిజానికి కాంగ్రెస్ వ్యతిరేక పునాదులపై ఏర్పాటైన టీడీపీని కాంగ్రెస్ చేతిలో పెట్టినప్పుడే బాబు పరువు పోయిందని అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.ఇప్పుడు బాబు ఎంత .కవర్ చేసుకున్నా… ఆయన తనపై వస్తున్న విమర్శలను తిప్పి కొట్టే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు.తెలంగాణా విషయానికి వస్తే.
చంద్రబాబు అనుకున్నది ఒక్కటి అక్కడ జరుగుతున్నది ఒక్కటి.పైకి కాంగ్రెస్ నాయకులు చంద్రబాబుకు విలువ ఇస్తున్నా తామే పైచేయి సాధిం చేందుకు ప్రయత్నిస్తున్నారు.
మొత్తానికి బాబు మాత్రం ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో గజిబిజి గందరగోళంలో మాత్రం పడిపోయాడు.