ఏపీలో ఎన్నికలకు మరెంతో సమయం లేని తరుణం లో ప్రధాన పార్టీలైన టీడీపీ వైసీపీ లు ప్రచారాలు మొదలు పెట్టేశారు.ఈ విషయంలో బాబు తో పోలిస్తే జగన్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నారని తెలుస్తోంది.
రోజుకు మూడు జిల్లాల్లో పర్యటిస్తూ జగన్ బిజీబిజీగా తన షెడ్యూల్ సిద్ధం చేసుకున్నారు.ఎన్నికలకు ఇంకా 20 రోజులు కూడా లేకపోవడంతో జగన్ కి సాయంగా ఆయన కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారానికి దిగుతున్నారు.
ముందుగా ఈనెల 27 నుంచి జగన్ సోదరి షర్మిల గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి ఆమె ప్రచారం ప్రారంభిస్తారని తెలుస్తోంది ఈ నియోజకవర్గం నుంచి.
టిడిపి తరఫున అభ్యర్థిగా పోటీ చేయనున్న నారా లోకేష్ టార్గెట్ గా షర్మిల ప్రసంగం ఓ రేంజ్ లో ఉండబోతోందని తెలుస్తోంది.
ఇక వైసిపి అధినేత జగన్ తల్లి వైయస్ విజయమ్మ కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 40 నియోజకవర్గాలలో ప్రచారం చేసే విధంగా రూట్ మ్యాప్ ఇందుకు సంబంధించిన ప్రచార రధాలు కూడా రెడీ అయ్యాయని తెలుస్తోంది.అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం సోలోగానే ప్రహ్చారం చేయనున్నారని తెలుస్తోంది.
బాబు కి కుటుంబ సభ్యుల నుంచి వస్తున్న సహకారం కూడా అంతంతమాత్రంగానే ఉందని తెలుస్తోంది.తండ్రికి బాసటగా కొడుకు లోకేష్ ఉన్నా ప్రస్తుతం మంగళగిరి ప్రచారంలో బిజీ బిజీగా ఉన్నాడు.ఒకవేళ లోకేష్ ని రాష్ట్రం మొత్తం ప్రచారం కోసం తిప్పితే పార్టీకి ఎలాంటి తలనొప్పులు వచ్చి పడతాయో అని కంగారు పడుతున్నారట.తీసుకు వస్తుందని భావించిన చంద్రబాబు లోకేష్ ప్రచారం విషయంలో పెద్దగా స్పందించడం లేదట ఇలా ఉంటే
బాలయ్య సంగతి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రచారం చేయవయ్య అంటే అభిమానులు కొట్టడం కామెడీ చేయడంలో చేస్తాడు తప్పితే ప్రచారాన్ని పూర్తిగా పక్కన పెడతాడు అని భయం వెంటాడుతోందట.దాంతో బావమరిది బాలయ్యకి కూడా ప్రచార బాధ్యతలు ఇవ్వడం లేదని తెలుస్తోంది.చంద్రబాబు సతీమణి కోడలు బ్రాహ్మణి ఎవరూ కూడా ప్రచారంలో పాల్గొనక పోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది అంటున్నారు
.