గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ కీలక నాయకులు.కమ్మ సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు నేతలకు పార్టీలో ప్రాధాన్యం లభించకపోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.టీడీపీలో ఇటీవల పార్లమెంటరీ పార్టీ ఇంచార్జ్లను నియమించారు.తాజాగా పార్టీ రాష్ట్ర కమిటీని నియమించారు.అదేసమయంలో పార్టీ పొలిట్ బ్యూరోను కూడా నియమించారు.ఎంతో మంది నాయకులకు పిలిచి మరీ పదవులు ఇచ్చారు.
ఇంత వరకు బాగానే ఉన్నా.గుంటూరు జిల్లాకు చంద్రబాబు న్యాయం చేయలేదనే వ్యాఖ్యలు పార్టీలో వినిపిస్తుండడం గమనార్హం.
తగిన విధంగా కెమిస్ట్రీ కుదరలేదని స్థానిక నాయకులు చెబుతున్నారు. గుంటూరు జిల్లాలో పార్టీకి కీలకమైన నాయకులుగా ఉన్న దూళిపాళ్ల నరేంద్ర కుమార్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, యరపతినేని శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు.
సహా అనేక మంది నేతలకు చంద్రబాబు మొండి చేయి చూపించారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వీరంతా కూడా కమ్మ సామాజికవర్గానికి చెందిన నాయకులే కావడం గమనార్హం.కేవలం ఎంపీ గల్లా కుటుంబానికి మాత్రం రెండు పదవులు ఇచ్చారు.
మిగిలిన వారిని పక్కన పెట్టారనే టాక్ వినిపిస్తోది.మరీ ముఖ్యంగా పార్టీని అంటిపెట్టుకున్న వారిలో ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కీలకం.అదేవిధంగా మాజీమంత్రి ప్రతిపాటి పుల్లారావు కూడా ముఖ్యులే.
ఇక, పార్టీలో ఇటీవల కాలంలో ఫైర్ బ్రాండ్లుగా ఉన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, యరపతినేని శ్రీనివాసరావులకు కూడా చంద్రబాబు పదవులు ఇవ్వలేదు.ఈ పరిణామాలతో కమ్మ వర్గంలో గుబులు రేగింది. కమ్మ సామాజిక వర్గమే అయినా.తమకు అందుబాటులో ఉండడం లేదని ఇప్పటికే అనేక ఫిర్యాదులు అందినప్పటికీ.
మరోసారి చంద్రబాబు గల్లా జయదేవ్కు ప్రాధాన్యం ఇవ్వడంపై వీరంతా ఉడికిపోతున్నారు.ఇచ్చుకోమనండి.
ఆయన పార్టీ ఆయన ఇష్టం.కానీ, మేం కూడా ఈ పార్టీనే నమ్ముకున్నాం కదా? మమ్మల్ని పట్టించుకోనక్కరలేదా? అంటూ వీరు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మరి ఈ పరిణామాలు ఎంతకు దారితీస్తాయో చూడాలి.ఏదేమైనా కీలకమైన జిల్లాలో కీలక సామాజిక వర్గానికి అన్యాయం చేశారనేది వాస్తవమేనంటున్నారు పరిశీలకులు.