ఒంగోలు ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ వ్యక్తి మృతదేహం రెండు రోజులుగా పడి ఉన్న వీడియోను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్ లో పోస్టు చేశారు.దానిని చూస్తుంటే ఎంతో బాధ కలుగుతోందని చంద్రబాబు అన్నారు.
గాయాలతో నేలపై పడి ఉన్న వ్యక్తి మృతదేహం కనిపిస్తోంది.అంతేకాకుండా అక్కడ కుక్కలు అరుస్తున్న శబ్దం వినిపిస్తోందని చంద్రబాబు అన్నారు.
నేలపై మృతదేహం పడి ఉన్నా సిబ్బంది మాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.
ఒంగోలు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద రెండు రోజులుగా రోగి మృతదేహం పడి ఉన్నా సిబ్బంది పట్టించుకోవడం లేదని.
, శవాన్ని కుక్కలు పీక్కుతుంటున్నాయని చంద్రబాబు అన్నారు.మానవతా విలువలకు తూట్లు పొడిచేలా వ్యవహరించారని అన్నారు.
ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే అని చంద్రబాబు విమర్శించారు.ఈ ఘటనను ఖండించేందుకు తనకు మాటలు కూడా రావడం లేదని చంద్రబాబు ట్వీట్ చేశారు.